బాలీవుడ్‌ లో అత్యధిక స్థాయిలో చర్చకు వచ్చిన ప్రేమ కథ అమితాబ్‌ బచ్చన్‌, రేఖ ల ప్రేమకథ. బాలీవుడ్‌ మెగాస్టార్‌ గా అమితాబ్‌ కెరీర్‌ ఫుల్ ఫాంలో ఉన్న సమయంలోనే అప్పటి స్టార్ హీరోయిన్ రేఖతో ప్రేమలో పడ్డాడు. అప్పటికే పలువురి తో ప్రేమ వ్యవహారాలు నడిపిన రేఖ తరువాత అమితాబ్‌ కు దగ్గరైంది. ఇద్దరు కెరీర్ పరంగా టాప్ రేంజ్‌లో ఉండటంతో వీరిద్దరి ప్రేమ కథ సెన్సేషన్ సృష్టించింది. ఇద్దరు కలిసి చాలా పబ్లిక్‌, ప్రైవేట్ ఫంక్షన్స్ లో కనిపించారు. చెట్టా పట్టా లేసుకొని తిరిగారు. కానీ ఎప్పుడూ తమ రిలేషన్‌ గురించి పబ్లిక్ గా అంగీకరించలేదు.

 

1976లో తెరకెక్కిన ధో అంజానే సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటికే అమితాబ్‌ కు వివాహమైంది. అయితే వీరిద్దరి ప్రేమ చాలా దూరం వెళ్లిందన్న ప్రచారం కూడా ఉంది. తొలి నాళ్లలో వీళ్లు రేఖ స్నేహితురాలికి సంబంధించిన ఓ బంగ్లాలో తరుచూ కలుసుకునేవారట. అయితే గంగా కి సౌగంది సినిమా షూటింగ్ సమయంలో వీరి ప్రేమ వ్యవహారం బయటపడింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఓ సహనటుడు రేఖ పట్ల అనుచితంగా ప్రవర్తించటంతో అమితాబ్‌ అతడి మీద  కోప్పడటంతో విషయం బయటకు వచ్చింది.

 

సిల్‌ సిలా సినిమా షూటింగ్ వరకు ఎంతో ప్రేమగా ఉన్న ఈ జంట ఈ సినిమా షూటింగ్ సమయానికి విడిపోయారు. అంతేకాదు సిల్‌ సిలా షూటింగ్ జరుగుతున్న సమయంలో వాళ్లు కనీసం మాట్లాడుకోవడానికి  కూడా ఇష్టపడలేదట. రేఖ అమితాబ్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే అప్పటికే అమితాబ్‌ కు వివాహం అయి ఉడంటంతో ఇక తను అతనితో రిలేషన్‌ లో ఉండటం వృధా అని భావించింది. అందుకే బిగ్‌ బీ కి దూరమైంది. సిల్‌ సిలా షూటింగ్ సమయంలోనే ఈ నిర్ణయం తీసుకున్న రేఖ తరువాత అమితాబ్‌ తో కలిసి నటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: