అక్కినేని ఫ్యామిలీలో మొత్తం మూడు లవ్ స్టోరీలు ఉన్నాయి. అందులో మొదటిది నాగార్జున, అమల వారిద్దరిదీ. అయితే పాతికేళ్ల తర్వాత వారి ఫ్యామిలీలో మరో లవ్ స్టోరీ సక్సెస్ ఫుల్ గా పెళ్లి పీటలు ఎక్కింది. ఇప్పటికే అర్థమై ఉంటది వారు ఎవరు అనేది ఇంకెవరు నాగచైతన్య, సమంత. " ఏం మాయ చేసావే..." అంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన సమంత నాగచైతన్య నిజంగానే మాయ చేసింది సమంత. మొదటి సినిమాతోనే వీరిద్దరూ చాలా దగ్గరగా అయ్యారని అని చెప్పవచ్చు. నిజానికి వీళ్ళిద్దరూ ఎప్పుడు ప్రేమలో పడ్డారో   తెలియదు కానీ మొత్తానికి పెళ్లి పీటలు ఎక్కి వారి ప్రేమని గెలిచారు.

 


వీరిద్దరూ మొదటగా ఏం మాయ చేసావో సినిమాలో కలిసి నటించారు. అయితే ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, మనం సినిమాలు వారిద్దరికీ మరింత దగ్గరగా చేయడానికి సహాయపడ్డాయి. ఇక అలాగే వీరిద్దరి సాన్నిహిత్యం కాస్తా ప్రేమగా మారి అది పెళ్లి వరకు వెళ్లారు. వీరిద్దరూ వారి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలిపి వాళ్ళని ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే అతిరథ మహారథుల మధ్య అంగరంగ వైభవంగా వీరిద్దరూ కలిసి ఏడు అడుగులు వేశారు. 

 


నిజానికి సమంత నాగచైతన్యను ప్రేమించక ముందే హీరో సిద్ధార్థను ప్రేమించిన విషయం అందరికీ తెలిసినదే. కానీ ఎందుకో తెలియదు వారి బంధం మూడునాళ్ళ ముచ్చట గానే విడిపోయింది. ఒక సమయంలో ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో సమంత నా జీవితం మహానటి సావిత్రి లాగా జరిగింది అని తెలిపింది. ఏది ఏమైనా నాగచైతన్య సమంత పెళ్లి తర్వాత కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరి సినిమాల్లో వారు బిజీ లైఫ్ ని గడుపుతూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే విద్దరూ కలిసి వాణిజ్య ప్రకటనలలో ఈ మధ్య బాగా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: