టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు అంటే మొదటగా గుర్తుకు వచ్చేది పూరి జగన్నాథ్. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండతో ఫైటర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే తాను దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే ఉత్సాహంతో ఫైటర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు పూరి. అయితే ప్రస్తుతం  మెగాస్టార్ చిరంజీవితో గాని పవన్ కళ్యాణ్ తో గాని పని చేసేందుకు రెడీగా ఉన్నారని సమాచారం వచ్చాయి. అయితే అందుకోసం ప్రస్తుతం కథలు రాస్తున్నారని ఇండస్ట్రీ సమాచారం తెలిసింది.


అయితే ఇవన్నీ ఇప్పుడు వట్టి పుకార్లే అని ఒక క్లారిటీ వచ్చింది. దీనిపై స్వయంగా పూరి జగన్నాదే  క్లారిటీ గా సమాధానం ఇచ్చారు. తన తదుపరి చిత్రం నందమూరి నట సామ్రాట్ బాలకృష్ణ తో అని పూరి వివరించారు. అయితే గతంలో బాలయ్యతో కలిసి పూరి జగన్నాథ్ పైసా వసూల్ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు అని చెప్పవచ్చు. ఈ సినిమా యావరేజ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టింది.. అయితే ఆ సినిమాలో మాత్రం బాలయ్య నటన మేనరిజాన్ని ఆయన అభిమానులతో మాత్రమే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకులు కూడా మంచి మార్కులు వేశారు. 


ఇప్పుడు ఇదే ఉత్సాహంతో  బాలయ్య బాబుతో మరో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు పూరి జగన్నాథ్. బాలయ్య బాబు విషయానికి వస్తే... ప్రస్తుతం ఆయన బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని సహకరిస్తే ఆ సినిమా తర్వాత బాలయ్య బాబు పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నటించబోతున్నాడు. అయితే ఇప్పుడు మరి ఈ కాంబినేషన్ లో ఎలాంటి చిత్రం రాబోతుంది, ఈసారైనా పూరి బాలయ్యను ఎలా చూపించబోతున్నాడు అలాగే విజయం సాధిస్తాడా అని తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: