దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇంటి పనులు చేస్తూ ప్రారంభించిన ఓ ఛాలెంజ్ టాలీవుడ్ లో వైరల్ అయిపోయింది. ‘బి ది రియల్ మ్యాన్’ పేరుతో రాజమౌళిని నామినేట్ చేసి అందరిలో అవేర్ నెస్ తీసుకురావాలని కోరాడు. దీనికి రాజమౌళి స్పందించి ఇంటి పని చేసి ఆ వీడియో పోస్ట్ చేశాడు. సందీప్ కోరుకున్నట్టు నిజంగానే ఈ ఛాలెంజ్ వైరల్ అయిపోయింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, సుకుమార్, కీరవాణి, శోభు యార్లగడ్డలను నామినేట్ చేస్తూ రాజమౌళి ట్వీట్ చేశాడు.

 

 

రాజమౌళి ఛాలెంజ్ ను ఎన్టీఆర్ యాక్పెప్ట్ చేసి మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, కొరటాల శివలను నామినేట్ చేశాడు. రామ్ చరణ్ కూడా రానా, శర్వానంద్ తో పాటు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ను నామినేట్ చేశాడు. దీంతో ఇప్పుడు ‘బి ది రియల్ మ్యాన్’ బాగా వైరల్ అయిపోయింది. అయితే.. ఈ ఛాలెంజ్ లో సూపర్ స్టార్ మహేశ్ ను, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రభాస్ లను మాత్రం మిగిలిన హీరోలు మర్చిపోయినట్టున్నారు. వీరి ముగ్గురిని ఏ ఇతర స్టార్ హీరో కూడా నామినేట్ చేయకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

 

 

అయితే.. ఇంకా కొంతమంది స్టార్ హీరోలు ఈ ఛాలెంజ్ పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి వారెవరైనా ఈ ముగ్గురు స్టార్స్ ను నామినేట్ చేస్తారేమో చూడాలి. ప్రస్తుతం ట్విట్టర్ నిండా టాలీవుడ్ హీరోల ఇంటి పనుల వీడియోలు హల్ చేస్తున్నాయి. ఇక్కడ టాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్స్ నుంచి ప్రెజంట్ జనరేషన్ టాప్ స్టార్స్ కూడా ఈ ఛాలెంజ్ లో ఒకరి నుంచి మరొకరు నామినేట్ అయిపోయారు. అభిమాన హీరోలు చేస్తున్న ఈ పనులను ఫ్యాన్స్ కూడా పాటిస్తూ హీరోలకు నిజమైన అభిమానులు అనిపించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: