ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఎంటర్టైన్ మెంట్ రంగం అంతా కుదులైంది. ఈ క్రమంలోనే అటు సినిమా ల షూటింగ్లు క్యాన్సిల్ కావడం.. ఇటు థియేటర్లు మూత పడడంతో సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. అసలు ఎప్పటకి థియేటర్లు తెరచు కుంటాయో ? ఈ సినిమాల షూటింగ్లు ఎప్పటకి అవుతాయో ? మళ్లీ థియేటర్లలో ప్రేక్షకులు ఎప్పటికి కళకళ లాడతారో ? కూడా ఎవ్వరికి అంతు పట్టడం లేదు. ఇక ఇప్పుడు బుల్లితెర మీద సీరియల్స్ కూడా ఆగిపోవడంతో బుల్లితె ర ప్రేక్షకులు కూడా సీరియల్స్కు మొహం వాచి ఉన్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు బుల్లితెర మీద అన్ని ఛానెల్స్ ఇప్పటి వరకు వేసిన హిట్ సినిమాలనే పదే పదే వేస్తూ రిపీట్ చేస్తున్నాయి. ఇక బుల్లితెర ప్రేక్షకులు కూడా వీటిని చూడక తప్పడం లేదు. ఇక కొన్ని ఛానెల్స్ పాత సినిమాలను వేస్తున్నాయి. పాత హిట్ సినిమాలకు ఇప్పుడు మంచి గిరాకీ ఏర్పడింది. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ఈ సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ - త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమా పోటీని తట్టుకుని హిట్ అయ్యింది.
ఈ సినిమా ఇప్పటికే ఉగాది రోజున బుల్లితెరపై ప్రదర్శించబడి మంచి టీఆర్పీ రేటింగ్ కూడా సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సినిమాలో ఎడిట్ లో తీసేసిన డిలీట్ సీన్స్తో పాటు హై క్వాలిటీతో ప్రదర్శిస్తున్నట్టు జెమినీ టీవీ వాళ్లు చెప్పారు. ఈ ఏప్రిల్ 26 ఆదివారం సాయంత్రం టెలికాస్ట్ చేస్తామని వారు తెలిపారు. అయితే ఇప్పుడు జెమినీ ఛానెల్ తన డెసిషన్ మార్చుకుందట.
ఈ స్లాట్లో సరిలేరును తీసేసి బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నటించిన “రాక్షసుడు” సినిమాను పెట్టారు. ఇంతలోనే సడెన్గా ఛానెల్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకోవడంతో మహేష్ అభిమానులు కాస్త హర్ట్ అవుతున్నారు.