మహేశ్, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అంటే.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగే. ఈ పండుగ ఎప్పుడెప్పుడా అని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మహేశ్ ను డైరెక్ట్ చేస్తాడని ఎనౌన్స్ చేయగానే.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. అయితే ఓ విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఓ భయం వీళ్లను వెంటాడుతోంది. 

 

రాజమౌళి.. మహేశ్ తో సినిమాను ఎనౌన్స్ చేసినా.. ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే అవకాశం లేదు. కరోనా కల్లోలంలో షూటింగ్ పూర్తయిన సినిమాలో ఎప్పుడు వస్తాయో చెప్పలేకపోతున్నారు. ఈ లెక్కన ట్రిపుల్ ఆర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చిత్ర యూనిట్టే చెప్పలేకపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మహేశ్ సినిమా 2021లోనే ప్రారంభమయ్యే అవకాశముంది. 

 

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ నటిస్తే.. అదొక పాన్ ఇండియా మూవీ అవుతుంది. మహేశ్ కు ఇండియా వైడ్ గుర్తింపు వస్తుంది. ఎవరూ చూపించని కోణంలో జక్కన్న చూపిస్తాడు. మహేశ్ స్టార్డమ్ రెట్టింపు అవుతుంది. ఇలా దర్శక ధీరుడి వలన ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్న.. మినిమం మూడేళ్లు తమ హీరో గ్యాప్ లో పడిపోతాడన్న భయం మాత్రం ఫ్యాన్స్ ను వెంటాడుతోంది. 

 

మహేశ్ తో సినిమా అంటే.. మూడేళ్లు మరో సినిమా చేయడం కుదరదు. బాహుబలి సిరీస్ కోసం ప్రభాస్ ఐదేళ్లు మరో మూవీ చేయలేదు. ట్రిపుల్ ఆర్ మొదలుపెట్టి ఏడాదిన్నరే దాటింది. ఇంకో ఏడాది పట్టేటట్లే కనిపిస్తోంది. మహేశ్ తో ఎలాంటి మూవీ తీస్తాడో తెలియదు. గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉంటే రెండేళ్ల తర్వాతే రిలీజ్ అవుతుంది. 

 

రాజమౌళి చేతిలో పడితే.. క్యాలెండర్ లో రెండు, మూడేళ్లు మరిచిపోవాల్సిందే. ఈ విషయం మహేశ్ కు తెలియంది కాదు. అందుకే రాజమౌళితో సినిమా మొదలయ్యేలోగా, రెండు సినిమాలు పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నాడట. పరశురామ్ దర్శకత్వంలో సినిమా దాదాపు ఖరారైంది. దీని తర్వాత మరో సినిమా చేసేసి.. రాజమౌళి దర్శకత్వంలో జాయిన్ అవుతాడట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: