ప్రస్తుతం మలయాళంలో పృథ్వి రాజ్ సుకుమారన్ టైం నడుస్తుందని చెప్పాలి. మలయాళంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు పృథ్వి రాజ్. అతను నటించిన అయ్యప్పనం కోషియం ఈ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకుంది. రైటర్ గా తన సత్థతా చాటిన సాచి సెకండ్ డైరక్టెడ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో పృథ్వి రాజ్ తో పాటుగా బిజూ మీనన్ కూడా సమానమైన రోల్ ప్లే చేశారు. మలయాళంలో సూపర్ హిట్టైన ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ప్రముఖ నిర్మాత దక్కించుకున్నారట. 

 

ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్ ప్రకారం ఈ సినిమా తెలుగు రీమేక్ లో బాలకృష్ణ, రానా నటిస్తాడని అంటున్నారు. పృథ్వి రాజ్ పాత్రలో రానా, బిజూ మీనన్ రోల్ కు బాలకృష్ణను అనుకుంటున్నారట. అయితే సినిమా చూసిన తెలుగు ఆడియెన్స్ మాత్రం పృథ్వి రాజ్ చేసిన కోషియం రోల్ కు రానా పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు కానీ బిజూ మీనన్ చేసిన అయ్యప్పనం పాత్రకు బాలకృష్ణ కష్టమే అంటున్నారు. సినిమాలో అతని పాత్ర చాలా లో ప్రొఫైల్ లో నడిపించారు. బిజూ మీనన్ వరకు ఓకే కానీ అదే పాత్ర తెలుగులో బాలయ్య బాబు చేస్తే మాత్రం వర్క్ అవుట్ అవధాని చెప్పొచ్చు. అసలు బాలకృష్ణరీమేక్ కు ఒప్పుకునే ఛాన్స్ లేదు. ఒకవేళ బాలయ్య బాబు ఆ రోల్ చేస్తే సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుంది.

 

పృథ్వి రాజ్, బిజూ మీనన్ ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా ఈ సినిమాలో నటించారు. లాస్ట్ ఇయర్ వచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ తో సూపర్ హిట్ అందుకున్న పృథ్వి రాజ్ అయ్యప్పనం కోషియం సినిమాతో కూడా సెన్సేషన్ హిట్ అందుకున్నాడు. మరి తెలుగులో రీమేక్ కాబోతున్న ఈ సినిమాలో కాస్టింగ్ ఫైనల్ ఎవరు అవుతారు. సినిమాను ఏ డైరక్టర్ చేతిలో పెడతారు అన్నది త్వరలో తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: