జూనియర్ ఎన్టీయార్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ ఫిగర్. యంగ్ టైగర్ బిరుదుతో రాణిస్తున్న జూనియర్ టాప్ స్టార్లలో ఒకడు. చిచ్చర పిడుగులా రెచ్చిపోయే ఆవేశంలో నందమూరి వంశం కీర్తి పతాకను ముందుకు తీసుకెళ్తూ వారసత్వాన్ని గట్టిగానే నిలబెడుతున్నాడు. జూనియర్ తన సినీ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఇపుడు కంప్లీట్ ఖాళీగా ఉన్నాడు.

లాక్ డౌన్ కారణంగా గత నెల రోజులుగా జూనియర్ ఎన్టీయార్ ఇంటిపట్టునే ఉంటున్నాడు. ఇక జూనియర్ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాడో కొన్ని మీడియాలో కూడా  వస్తున్నాయి. ఈ మధ్యనే అర్జున్ రెడ్డి దర్శకుడు  విసిరిన చాలెంజిని స్వీకరించి జూనియర్ ఇంట్లో పనులన్నీ చేశాడు. తన ఇంట్లో తాను చేసిన పనుల గురించి వీడియో కూడా పోస్ట్ చేసి ఫ్యాన్స్ ని ఉత్సాహపరచాడు

 

ఇక జూనియర్ ఇపుడు మరో పని కూడా ఈ ఖాళీ వేళ చేస్తున్నాడుట. అదె జనతా గ్యారేజ్ లో తనతో పాటు నటించిన మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని తన గురువుగా చేసుకున్నాడుట. ఈ ఖాళీ టైంలో జూనియర్ మళయాళ భాషను నేర్చుకుంటున్నాడుట. ఇది నిజంగా మంచి విషయమే. విలువైన ఈ కీలకమైన సమయంలో కొత్త భాషను నేర్చుకోవడం అంటే జూనియర్ని అభినందించి తీరాల్సిందే.

 

ఇక జూనియర్ కి మళయాళ భాష విషయంలో ట్రైనింగ్ ఇస్తూ సలహాలు సూచనలు చెబుతున్నది మోహన్ లాల్. ఆయనే మాస్టర్ గా మారి క్లాస్ తీసుకుంటున్నాడుట. మొత్తానికి జూనియర్ ఖాళీ అన్నది లేకుండా కాలానికి ఖరీదు కట్టి మరీ విలువ పెంచుతున్నాడన్నమాట. మరి ఇదే విషయాన్ని అభిమానులు కూడా స్పూర్తిగా తీసుకుని పాటిస్తే ఎంతో మంచిది కదా. మరి జూనియర్ ఫ్యాన్స్ కూడా లాక్ డౌన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీలైతే ఆడియన్స్ కూడా కొత్తది ఏదైనా నేర్చుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: