సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఇటీవల ప్రేక్షేకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. యంగ్ సక్సెఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో మహేష్ బాబు ఒక మిలిటరీ మేజర్ పాత్రలో నటించగా ఆయన సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ల పై నిర్మితం అయిన ఈ సినిమాలో విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా తరువాత ఇప్పటివరకు మహేష్ తన తదుపరి సినిమాని అనౌన్స్ చేయకపోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ దానికొరకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

 

ఇటీవల ఒకానొక సందర్భంగా తన నెక్స్ట్ సినిమా వంశీ పైడిపల్లితో ఉంటుందని చెప్పిన మహేష్, ప్రస్తుతం ఆ సినిమా కథ పూర్తి కాకపోవడంతో దానిని ప్రక్కన పెట్టినట్లు టాక్. అలానే కొద్దిరోజుల క్రితం యువ దర్శకుడు పరశురామ్ చెప్పిన ఒక స్టోరీ లైన్ కి ఎంతో ఇంప్రెస్ అయిన మహేష్, ఆయన తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అతి త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుందని కొన్నాళ్లుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని తీసుకుంటారు అనే విషయమై ముందుగా దేవిశ్రీప్రసాద్, ఆ తరువాత థమన్, అలానే ఇటీవల గోపిసుందర్ పేర్లు బయటకు రావడం జరిగింది. 

 

థమన్ ని తీసుకుంటారని అప్పట్లో గట్టిగా ప్రచారం సాగినప్పటికీ, తాజాగా అందుతున్న అప్ డేట్ ప్రకారం గోపిసుందర్ ఖాయమయినట్లు చెప్తున్నారు. అయితే ఈ విషయంలో మహేష్ నిర్ణయమే శిరోధార్యం అని సమాచారం. వాస్తవానికి తన సినిమాలకు థమన్, దేవి ఇద్దరూ కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారని, అయితే ఈసారి ఒకింత కొత్తగా గోపిసుందర్ ని ట్రై చేస్తే బెటర్ అని మహేష్ చెప్పినట్లు టాక్. అలానే పరశురామ్ కూడా తన గత సినిమా గీతగోవిందం కు అతడినే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడం, ఆ సాంగ్స్ మంచి హిట్ సాధించడంతో యూనిట్ మొత్తం కూడా గోపి కే ఓటేయడం జరిగిందని అంటున్నారు. మరి ఈ విషయమై ఏమి జరుగుతుందో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: