యాంకర్ అనసూయ.. ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడు.. అన్ని విషయాల్లో తానే సూపర్ హిట్ అన్నట్టు.. ఇద్దరు పిల్లలు పుట్టిన సరే ఏ మాత్రం ఫిట్ నెస్ తగ్గనట్టు.. పొట్టి డ్రెస్ లలో దర్శనం ఇస్తూ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంటుంది.. ఆ హాల్ చల్ చేస్తే ఆశ్చర్యం తప్పదు మరి.. ఎప్పుడు బుల్లితెరపై ఎలా కనిపిస్తుంటుందో.. అలాగే వివాదాలలో కూడా చిక్కుకుంటూ బిజీగా ఉంటుంది. 

 

ఇంకా అలాంటి యాంకర్ అనసూయ ఎప్పుడు చూడు సోషల్ మీడియాలో ఏదో ఓక పోస్ట్ చేసి హాల్ చల్ చేస్తుంటుంది.. ఒకసారి తోటలో పొట్టి నిక్కర్ తో కనిపించి వివాదాలలో చిక్కుకున్న అనసూయ.. ఇటీవలే లాక్ డౌన్ పై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారి తియ్యడంతో సైలెంట్ అయినా అనసూయ.. ఇంట్లో హాల్వా చేసుకుంటూ కూర్చుకుంది. 

 

ఇక అప్పటి నుండి ఆచి తూచి అడుగులు వేస్తున్న అనసూయ ఈరోజు ఓ విషయాన్నీ చెప్పి అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. ''మీ తొలి పారితోషికంతో ఏం చేశారు?'' అని నెటిజన్ వేసిన ప్రశ్నకు అనసూయ స్పందిస్తూ.. ''మా అమ్మకు గోల్డ్ రింగ్ కొనిచ్చాను. అది నాకు ఎంతో సంతోషాన్ని .. సంతృప్తిని ఇచ్చిన సందర్భం'' అని సమాధానమిచ్చింది. దీంతో నెటిజన్లు అంత అవకైపోయారు.. ఆశ్చర్యపోయారు. 

 

''ఛాలెంజింగ్ గా తీసుకుని మీరు చేసిన రోల్ ఏది?'' అనే ప్రశ్నకు స్పందించిన అనసూయ ''నేను ఇంతవరకూ ఛాలెంజింగ్ అనుకుని చేసిన రోల్ ఏదీ లేదు .. ఎందుకంటే అసలు అలాంటి రోల్ నాకు రాలేదు'' అంటూ చెప్పుకొచ్చింది.. ఇలా నెటిజన్ల ముచ్చటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.. ఈ వివాదాల అందాల భామ! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: