ఒక భాషలో తెరకెక్కిన సినిమాలు మరో భాషలో రీమేక్ కావడం సహజమే. తెలుగులో తెరకెక్కిన ఓ సినిమా ఇంకా విడుదల కాకముందే తమిళ్ రీమేక్ రైట్స్ అమ్ముడైపోయాయని సమాచారం. తెలుగులో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమానే ‘ఉప్పెన’. ఈ సినిమాను తమిళ్ లో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. స్టార్ హీరో విజయ్ సేతుపతిసినిమా తమిళ హక్కులను తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో నటించే హీరో కూడా కన్ఫర్మ్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి.

 

 

తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నట్టు సమాచారం. విజయ్ సేతుపతి ఉప్పెనలో విలన్ పాత్ర పోషించాడు. కథ తమిళ్ కు కూడా కనెక్ట్ అవుతుందని భావించి హీరో విజయ్ తో గతంలోనే చర్చించినట్టు తెలుస్తోంది. కథ విన్న విజయ్ తన కుమారుడు తెరంగేట్రానికి ఇటువంటి సినిమా కరెక్ట్ గా సూటవుతుందని చెప్పినట్టు సమాచారం. అందుకే విజయ్ సేతుపతిసినిమా రైట్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జాసన్ సంజయ్ కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేస్తూ అక్కడే ఉన్నాడు. త్వరలో కోర్స్ పూర్తి చేసి రాబోతున్నాడు.

 

 

ప్రస్తుతం ఈ వార్త తమిళ సినీ సర్కిల్స్ లో రౌండ్ అవుతోంది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉన్నా కరోనా ప్రభావం వల్ల విడుదల కాలేదు. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి విజయ్ ఈ సినిమాను నిర్మిస్తాడని అంటున్నారు. సుకుమార్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం కావొచ్చని అంటున్నారు. తెలుగులో దర్శకత్వం వహించిన బుచ్చిబాబు సానానే తమిళ్ లో కూడా దర్శకత్వం చేస్తాడని అంటున్నారు. పరిస్థితులు చక్కబడ్డాక దీనిపై పూర్తి అఫిషియల్ డిటైల్స్ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: