స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'పుష్ప'. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. సక్సస్ ఫుల్ చిత్రాలని అందిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 'ఆర్య'..  'ఆర్య2' తర్వాత అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప రూపొందుతుండటం విశేషం.

 

శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమా కథ ని తెరకెక్కిస్తున్నారు సుకుమార్. అంతేకాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ రాయలసీమ యాసలో మాట్లాడతాడని తెలుస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అల్లు అర్జున్ కంప్లీట్ మాస్ గెటప్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాని తెలుగు-హిందీ-తమిళం- మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక రంగస్థలం తో సుకుమార్ అల వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్ సక్సస్ లని అందుకొని ఉండటం తో ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే సుకుమార్సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

 

ఇప్పటికే రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా తను ఈ సినిమాలో గిరిజన యువతి పాత్రలో కనిపించబోతుందని చిత్తూరు జిలా యాసలో మాట్లాడేందుకు ప్రాక్టీస్ చేస్తుందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందని తెలుస్తుంది. భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పాపులర్ అయిన కియారా అద్వాని పుష్ప సినిమాలో పోలీస ఆఫీసర్ గా నటిస్తుందని లేటెస్ట్ న్యూస్. ఈ పాత్ర కి కియారా అయితే పర్‌ఫెక్ట్ గా సూటవుతుందని సుకుమార్ ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది. గత కొంత కాలంగా బాలీవుడ్ లోనే బిజీగా ఉన్న ఉన్న కియారా మళ్ళీ ఈ సినిమాతో టాలీవుడ్ కి రానుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: