పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వకీల్ సాబ్'. హిందీ లో సూపర్ హిట్ గా నిలిచిన 'పింక్' సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ లో అజిత్ పోషించిన పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. నివేదా థామస్, అంజలి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడులైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్ తో పాటు ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

 

దాదాపు 80 శాతం కంప్లీటయిన ఈ సినిమా వాస్తవంగా మే 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని దిల్ రాజు సన్నాహాలు చేశారు. కాని అనూహ్యంగా సంభవించిన కరోనా కారణంగా బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీటవకుండానే బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో నిర్మాత దిల్ రాజు ఉనారు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలోను నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ,ఎం.రత్నం నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కూడా ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. 

 

అలాగే హరీష్ శంకర్ సినిమా కూడా ఈ సంవత్సరం సెట్స్ మీదకి వెళ్ళే అవకాశాలున్నాయి. ఈ సినిమా తర్వాత త్రివిక్రం లేదా డాలి సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తారు. అయితే ఈ సినిమాలతో పాటు తాజాగా పవన్ కళ్యాణ్ నటించబోయో బాలీవుడ్ సినిమా కూడా ఒకటి ఉండబోతుందని సమాచారం. వకీల్ సాబ్ కి సహ నిర్మాత అయిన బోనీ కపూర్సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో హిందీలో స్ట్రైట్ సినిమాకి సన్నాహాలు చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా భారీ యాక్షన్ కథ ని సిద్దం చేపిస్తున్నారని తెలుస్తుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ బాలీవుడ్ ఎంట్రీకి ఈ సినిమా పర్‌ఫెక్ట్ అని తెలుస్తుంది. ఇది అనౌన్స్ అయితే ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి పండగే. 

మరింత సమాచారం తెలుసుకోండి: