స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దిల్ రాజు కాంబినేషన్ లో గతంలో ఆర్య, పరుగు, దువ్వాడ జగన్నాధం సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. ఆర్య అయితే ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియీట్ చేసింది. అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ అన్న ఇమేజ్ కూడా తీసుకు వచ్చింది. ఇక ఇదే కాంబినేషన్ లో మరో సినిమాకి సన్నాహాలు చేశారు నిర్మాత దిల్ రాజు. ఎం.సి.ఏ ఫేం వేణు శ్రీ రాం దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ అన్న టైటిల్ తో సినిమాని అనౌన్స్ చేశారు.

 

కాని కొంత కాలంగా ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడం తో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని అనుకున్నారు. అయితే ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా
నిర్మాత దిల్ రాజు అల్లు అర్జున్ తో పాటు ఫ్యాన్స్ కి సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చి స్వీట్ షాకిచ్చారు. అందరూ ఆగిపోయిందనుకున్న 'ఐకాన్' సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసి దిల్ రాజు ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్ అని తేల్చేశారు. వాస్తవంగా నా పేరు సూర్య' సినిమా తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ 'ఐకాన్'. కాని కొన్ని కారణాల వల్ల 'ఐకాన్' ని దిల్ రాజు పక్కన పెట్టారని వార్తలు వచ్చాయి. 

 

దాంతో అల్లు అర్జున్ త్రివిక్రం తో అల 'వైకుంఠపురములో' కంప్లీట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత సెట్స్ మీద ఉన్న సినిమానే సుకుమార్ తెరకెక్కిస్తున్న 'పుష్ప'. ప్రస్తుతం వేణు శ్రీ శ్రీరామ్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ ని తెరకెక్కిస్తున్నాడు. దాదాపు ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీటయింది. ఈ సినిమా ఆగస్టు లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆ తర్వాత వేణు శ్రీరామ్ 'ఐకాన్' సినిమాని మొదలు పెడతాడట. అయితే ఇంతకాలం ప్రాజెక్ట్ డిలే అవడానికి కారణం స్క్రిప్ట్ అని తెలుస్తుంది.

 

పక్కాగా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసి మొదలుపెడతారని దిల్ రాజు అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చే నాలుగో సినిమా కాబట్టి బ్లాక్ బస్టర్ కొట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు లేటెస్ట్ న్యూస్. అంతేకాదు అక్టోబర్ లేదా నవంబర్ లో మొదలు పెట్టి 2021 సమ్మర్ స్పెషల్ గా సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: