మెగాస్టార్ చిరంజీవి సినిమాలు అనగానే ప్రేక్షకులు డైలాగుల కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. ఆయన డైలాగులు ఎక్కువగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. మాస్ సినిమాల్లో చిరంజీవి పెట్టింది పేరు. అందుకే మాస్ ని ఆకట్టుకునే విధంగా దర్శకులు ఆయన సినిమాల్లో డైలాగులు ఉండే విధంగా జాగ్రత్తలు పడుతూ ఉంటారు. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ఇంద్ర. ఆయన ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించారు. ప్రతీ సీన్ లో కూడా ఆయన నటన బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆయన విలన్ ముఖేష్ ఋషీ వద్ద చెప్పిన డైలాగ్... 

 

వీర శంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అనే డైలాగ్ ఇప్పటి వరకు కూడా ఫేమస్  అయింది. ఇక ఈ సినిమాలో... ముకేష్ రుషి చిరంజీవి మధ్య జరిగిన సన్నివేశాలు బాగా హైలెట్ అయ్యాయి. వీర శంకర్ రెడ్డి తన కొడుకుని చంపినా సమయంలో చిరంజీవి డైలాగులు బాగా ఆకట్టుకున్నాయి. అదే విధంగా తన కుటుంబాన్ని ప్రత్యర్ధులు చంపినప్పుడు చిరంజీవి డైలాగులు కూడా ఆకట్టుకున్నాయి. కాశీ పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నారా అంటూ చిరంజీవి ఒక డైలాగ్ వదిలారు. 

 

ఇప్పటికి దానిని టిక్ టాక్ లో చేస్తూనే ఉంటారు మెగా అభిమానులు. ఆ తర్వాత వచ్చిన ఠాగూర్ సినిమాలో కూడా ఆయన డైలాగులు బాగానే ఆకట్టుకున్నాయి ప్రేక్షకులను. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని మాత్రం ఆకట్టుకున్న సినిమా మాత్రం ఇంద్ర. ఈ సినిమాలో ఆయన చెప్పే డైలాగులకు ప్రేక్షకులు పూల వర్షం కురిపించారు అంటే ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత చిరంజీవి రేంజ్ మరింతగా పెరిగింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఆయన తో సినిమా చెయ్యాలి అనుకునే దర్శకులు ఎందరో.

మరింత సమాచారం తెలుసుకోండి: