టాలీవుడ్ లో పోకిరి సినిమా ఒక సంచలనం అనే సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు అనే చెప్పాలి. ఈ సినిమాలో ఉండే ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. మహేష్ బాబు చెప్పే కొన్ని కొన్ని డైలాగులు ఇప్పటికి వినపడుతూనే ఉంటాయి. ప్రతీ సీన్ ని కూడా పూరి చాలా జాగ్రత్తగా తీసారు. ఇక ఈ సినిమాలో మహేష్ నోటి నుంచి వచ్చే మాటలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. 

 

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండు గాడు అంటూ మహేష్ నోటి నుంచి వచ్చిన డైలాగ్ టాలీవుడ్ ని ఊపేసింది. ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ప్రకాశ రాజ్... మహేష్ బాబు మాట్లాడుకునే మాటల్లో ఉండే డైలాగ్స్ కూడా బాగానే ఉంటాయి. నాకు తాగాలనిపిస్తే తాగుతా అంటూ  మహేష్ మాట్లాడిన మాటను యూత్ ఇప్పటికి వాడుతూనే ఉన్నారు. అదే విధంగా ఒక పబ్ సన్నివేశంలో మరో విలన్ తో మహేష్ బాబు... నీ అక్కదో చేల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది రా అంటూ... 

 

ఒక చిన్న మాట వదులుతారు. ఆ సినిమాకు అది కూడా హైలెట్ గా నిలిచింది. ఇక హీరోయిన్ తో మహేష్ బాబు మాట్లాడే మాటలు, డైలాగులు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ప్రకాష్ రాజ్ మహేష్ బాబు సంభాషణల్లోనే కాకుండా మహేష్ బాబు తన ఫిరెండ్స్ వద్ద మాట్లాడే మాటలు కూడా హైలెట్ అయ్యాయి ఆ సినిమాలో. ఈ సినిమా మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదుఅక్కడి నుంచి మహేష్ రేంజ్ పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: