2020 సంవత్సరం బిగినింగ్ లో వచ్చిన 'భీష్మ' సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో నితిన్ - రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సోషల్ కాన్సెప్ట్ టచ్ చేస్తున్న లవ్ అండ్ హ్యూమర్ ప్రధాన అంశాలతో దర్శకుడు తెరకెక్కించిన విధానం జనాలకు తెగనచ్చేసింది. అయితే కరోనా మహమ్మారి వచ్చి ఈ సినిమా లాంగ్ రన్ పై దెబ్బేసింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్లు, మల్టీప్లెక్సులు మూతపడ్డాయి. దీంతో 'భీష్మ' లాంగ్ రన్ కలెక్షన్స్ మీద కూడా కరోనా పంజా విసిరింది. ఈ మూవీ నిర్మాతలకు లాభాలు పంచినప్పటికీ కొన్ని వసూళ్లను కోల్పోవడం జరిగింది.

 

ఇదిలా ఉండగా ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. 'భీష్మ' ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 25 నుండి అందుబాటులోకి తీసుకురానుంది. థియేటర్స్ లో మిస్సైన ప్రేక్షకులతో పాటు.. లాక్ డౌన్ కారణంగా ఇళ్లలో ఉన్న జనాలకు భీష్మ బెస్ట్ ఛాయిస్ అయ్యే అవకాశం కలదు. కాబట్టి భీష్మ కాసుల వర్షం కురిపించడం ఖాయం అని అందరూ నమ్ముతున్నారు. వెండితెర మీద కాసుల వర్షం కురిపించిన 'భీష్మ' ఇప్పుడు బుల్లితెర మీద కాసుల వర్షం కురిపించనుందన్నమాట. ఇదిలా ఉండగా నితిన్ ప్రస్తుతం యువ దర్శకుడు వెంకీ అట్లూరితో ‘రంగ్ దే’ అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో 'మహానటి' కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'భీష్మ' చిత్రం హిట్ కావడంతో నితిన్‌ - నాగవంశీ కాంబినేషన్ రిపీట్ చేశారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించడం విశేషం. నితిన్ - కీర్తి సురేష్‌లు తొలిసారి ఈ ఇద్దరూ కలిసినటిస్తుండటంతో కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: