'నీది నాది ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్షన్ లో రానా , సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'విరాటపర్వం'. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రియలిస్టిక్ గా తెరకెక్కుతున్న ఈచిత్రం ఇప్పటివరకు 70 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రంలో హాలీవుడ్ స్టంట్ మాస్టర్ స్టీఫన్ రిచ్టర్ కొరియోగ్రఫి చేసిన యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ కానున్నాయట. ఇక ఈ చిత్రంలో రానా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనుంది. వీరితోపాటు సీనియర్ నటి ప్రియమణి కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈచిత్రంలో తను నక్సలైట్ గా నటిస్తున్నట్లు తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో ప్రియమణి వెల్లడించింది. సురేష్ బాబు , చెరుకూరి
సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం ఈఏడాది చివర్లో విడుదలకానుంది.
ఇక ఈ సినిమాతో పాటు ప్రియమణి , అగ్ర హీరో వెంకటేష్ నటిస్తున్న నారప్ప లో కూడా నటిస్తున్నాని కన్ ఫర్మ్ చేసింది. కోలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ మూవీ అసురన్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తుండగా ప్రముఖ
తమిళ నిర్మాత కలై
పులి ఎస్ తాను తో కలిసి
సురేష్ బాబు నిర్మిస్తున్నాడు.
మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కరోనా లేకుంటే ఈపాటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అవుతుండేది. కానీ కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ఆగస్టు లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. ఒరిజినల్ వెర్షన్
అసురన్ లో
ధనుష్ , మంజు వారియార్ జంటగా నటించగా గత ఏడాది విడుదలైన ఈ చిత్రం 70కోట్ల వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మరి
నారప్ప కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.