టాలీవుడ్ జనాలకు కరోనా లాక్ డౌన్  సమయంలో వచ్చిన గుడ్ న్యూస్ ఏదైనా ఉందా అంటే... మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా వస్తుంది అనే అధికారిక ప్రకటన. మహేష్ బాబు తో తాను తర్వాతి సినిమా చేస్తున్నా అని జక్కన్న నోటి నుంచి రాగానే టాలీవుడ్ జనం పండగ చేసుకున్నారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ సినిమా కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా కథ ఏ విధంగా ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ ఇప్పటి నుంచే నెలకొంది. 

 

సినిమా కోసం జనాలకు ఒక క్రేజ్ ఇప్పటి నుంచే ఏర్పడింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇక ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాకు నిర్మాతలుగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉండే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. రామ్ చరణ్సినిమా కోసం దాదాపు గా 60 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాలో పెట్టుబడి పెట్టడానికి మహేష్ బాబు కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. 

 

సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో అని టాలీవుడ్ జనం కూడా ఎంతో ఆశ గా ఎదురు చూసే పరిస్థితి. ఇక బాలీవుడ్ లో కూడా ఈ సినిమా హాట్ టాపిక్ అవ్వడం అనేది ఖాయంగా కనపడుతుంది అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఈ సినిమాతో మహేష్ బాబు రేంజ్ మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాలో పెట్టుబడి పెడితే భారీగా వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు టాలీవుడ్ జనం. అందుకే ఈ సినిమాలో పెట్టుబడి పెట్టడానికి హీరోలు ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: