మహేష్ బాబు తో సినిమా చేయడానికి గానూ ఎందరో దర్శక నిర్మాతలు పోటీ పడుతూ ఉంటారు అనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు తో సినిమా అవకాశం వస్తే చాలు పండగ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలంటి మహేష్ బాబు తో సినిమా చేయడానికి ఈ మధ్య కాలంలో కొందరు దర్శక నిర్మాతలు భయపడుతున్నారు అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. దానికి కారణం మహేష్ కి ఉన్న కమర్షియల్ పిచ్చి అనేది టాలీవుడ్ జనాల మాట. మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ రావడం తో అతను భారీగా రేటు పెంచాడట. 

 

మహేష్ బాబు తో ఒకప్పుడు సినిమా చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు భయపడుతున్నారు అంటే ప్రధాన కారణం అదే అనేది టాలీవుడ్ జనాల మాట గా చెప్పుకోవచ్చు. ఇది పక్కన పెడితే ఇప్పుడు మహేష్ బాబు తో ఒక అగ్ర దర్శకుడి కి గొడవలు ఉన్నాయని అంటున్నారు. మహేష్ తో సినిమా చేసి శదరు దర్శకుడు బాగా నష్టపోయారు అనేది టాలీవుడ్ జనాల మాట. సరిలేరు నీకెవ్వరు  సినిమా ఆ నిర్మాతకు భారీ నష్టాలు ఇచ్చింది అనేది టాలీవుడ్ జనాల మాట. ఇప్పుడు మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యాలని ఆయన చూస్తున్నాడు. 

 

అయినా సర్ ఏమహేష్ బాబు మాత్రం సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు అనే వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి. ముందు మాట ఇచ్చినా సరే మహేష్ బాబు ముందుకి వచ్చి సినిమా చేయకపోవడం చికాకుగా మారింది సదరు నిర్మాతకు మారింది అంటున్నారు. మహేష్ బాబు ఇప్పుడు పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమా నిర్మాత ఎవరు అనేది స్పష్టంగా తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: