శర్వానంద్, సమంత జంటగా నటించిన చిత్రం జాను. కోలీవుడ్ లో కల్ట్ సినిమా గా గుర్తింపు తెచ్చుకున్న మూవీ 96 కు రీమేక్ గా తెరకెక్కడంతో విడుదలకు ముందు ఈ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ విడుదల తరువాత షాకింగ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. పాజిటివ్ రివ్యూస్ వచ్చినా  కూడా జనాలు థియేటర్లలో సినిమా ను చూడడానికి ఇష్టపడలేదు. దానికి కారణం  సినిమా స్లో గా ఉండడం.. దాంతో ఈచిత్రం ఫుల్ రన్ లో 10 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయింది. 20కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం తో  నిర్మాత దిల్ రాజు కు జాను భారీ నష్టాలను మిగిల్చింది. 
 
ఇక కనీసం బుల్లితెర పై అయినా సత్తాచాటుతుందనుకుంటే అక్కడ కూడా నిరాశపరించింది. ఇటీవల ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ ఛానల్ మొదటి సారి ప్రసారం చేయగా  కేవలం 7.03 టీఆర్పీ ని మాత్రమే రాబట్టింది. లాక్ డౌన్ సమయంలో కూడా ఇంత తక్కువ రేటింగ్ రావడం గమనార్హం.  ఒరిజినల్ వెర్షన్  డైరెక్టర్ రామ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి గోవింద్ వసంతా సంగీతం అందించాడు. ఇక  రీమేక్ తోనైనా హిట్ కొడదామనుకున్న శర్వానంద్ ఆశలు కూడా నెరవేరలేదు. ప్రస్తుతం శర్వా చేతిలో రెండు సినిమాలు వున్నాయి.
 
అందులో ఒకటి నూతన దర్శకుడు కిషోర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న శ్రీకారం. ఈచిత్రంలో శర్వా, రైతు పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తోపాటు శర్వా, శ్రీ కార్తీక్ డైరెక్షన్ లో ద్వి భాషా చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇక జాను తరువాత సమంత మాత్రం ఇంతవరకు మరో సినిమా కు సైన్ చేయలేదు.  అయితే నిర్మాత గా మారి డైరెక్టర్ నందిని రెడ్డి తో ఓ సినిమాను ప్లాన్ చేస్తుందని టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: