తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి ఉన్న క్రేజ్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన  సినిమా అన్ని రియలిస్టిక్ సినిమాలకి దగ్గరగా ఉంటాయి. ఇక ఏదో ఒక వివాదాన్ని తెర మీదికి తెస్తూ సినిమాలను తెరకెక్కించి ఉంటారు రాంగోపాల్ వర్మ. అందుకే రాంగోపాల్ వర్మ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. రాంగోపాల్ వర్మ ఎప్పుడు వివాదాస్పద సినిమాలను తెరకెక్కిస్తుంటాడు.  సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు. తన సినిమాలతోనే  కాదు తన మాటలతో కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ  పెట్టే పోస్టులు అయితే క్షణాల్లో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. 

 

 అయితే రాంగోపాల్ వర్మ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవార్డు ఫంక్షన్ కి హాజరైన రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. మోహన్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు మోహన్ బాబు అంటే ఇష్టం ఉండదని అందరి ముందు చెప్పాడు రామ్ గోపాల్ వర్మ. అయితే అందరూ షాక్ అయ్యే లోపే ఎందుకు ఇష్టం ఉండదు చెప్పి అందరినీ నవ్వించాడు. తాను  జయసుధ ఓ సినిమా పోస్టర్ పై చూసి ప్రేమలో పడ్డాను అని తాను  అంతగా ప్రేమించే జయసుధను  మోహన్ బాబు అనే వ్యక్తి.. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన శివరంజని అనే  సినిమాలో అష్టకష్టాలు పెట్టి ఏడిపించాడు అంటూ రాంగోపాల్ వర్మ తెలిపాడు.

 

 అందుకే తనకు ఇప్పటికీ మోహన్ బాబు  అంటే ఇష్టం ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. అప్పుడు టికెట్ కొనడానికి కూడా డబ్బు లేని సమయంలో దాసరి నారాయణరావు గారు తెరకెక్కించిన శివరంజని సినిమా జయసుధ  కోసం ఏకంగా ఏడు సార్లు చూశాను అంటూ చెప్పుకొచ్చాడు రాంగోపాల్ వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: