రెండేళ్ల గ్యాప్ తరువాత అతి త్వరలో వకీల్ సాబ్ ద్వారా టాలీవుడ్ కి నటుడిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ కొట్టి తన ఫ్యాన్స్ ని ఖుషి చేయాలనీ చూస్తున్నారు. మరోవైపు ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ లో కూడా నటిస్తున్న పవన్ కళ్యాణ్, దాని అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించబోయే సినిమాని కూడా అప్పుడే లైన్ లో పెట్టారు. ఇటీవల ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన రావడం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 

 

ఇకపోతే పవన్ తో గతంలో మొత్తం మూడు సినిమాలు తీసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అందులో ముందుగా జల్సాతో మంచి హిట్ అందుకోగా, ఆపై వచ్చిన అత్తారింటికి దారేది సినిమా కూడా పెద్ద హిట్ కొట్టింది, అయితే ఇటీవల రెండేళ్ల క్రితం వచ్చిన అజ్ఞాతవాసి మాత్రం ఘోర పరాజయాన్ని అందుకుంది. పవన్ కెరీర్ లో 25వ సినిమాగా వచ్చిన ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఎంతో డిజప్పాయింట్ అయిన ఆయన ఫ్యాన్స్, మరొక్కసారి వారిద్దరి కాంబోలో మంచి సినిమా కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. కాగా ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ఒక కథ సిద్ధం చేస్తున్న త్రివిక్రమ్, దానిని ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కించి, వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేస్తారని అంటున్నారు. 

 

కాగా ఇటీవల కొద్దిరోజుల క్రితం సడన్ గా పవన్ ని ఒక సందర్భంలో కలిసిన త్రివిక్రమ్, ఒక అద్భుతమైన స్టోరీ లైన్ ని ఆయనకు వినిపించారని, అది ఎంతో నచ్చిన పవన్ కూడా దాని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని అన్నట్లు సమాచారం. అన్ని కలిసి వస్తే, పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ సినిమా అనంతరం, పక్కాగా త్రివిక్రమ్ సినిమా ఉండే అవకాశం ఉందని, ఈ ఏడాది చివర్లో ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని టాక్. ఒకరకంగా ఇది పవన్ ఫ్యాన్స్ కు పండుగ లాంటి వార్తని, ఇదే నిజమైతే వారి ఆనందానికి అవధులు ఉండవని అంటున్నారు విశ్లేషకులు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: