లాక్ డౌన్ టైం లో సెలబ్రిటీష్ అంతా తమలోని కొత్త టాలెంట్ ను ప్రేక్షకులకు చూపిస్తున్నారు. స్టార్స్ కదా వాళ్ళ రేంజ్ వేరేలా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఎలాంటి పనులు చేయరని అనుకుంటారు. కానీ మేమెంత స్టార్స్ అయినా సరే మా పనులు మేమే చేసుకుంటాం అని చూపిస్తున్నారు. బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ లో భాగంగా ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా కూడా రియల్ మ్యాన్ అనిపించుకుంటున్నారు. సందీప్ వంగ టూ రాజమౌళి, అక్కడ నుండి ఆర్.ఆర్.ఆర్ హీరోస్ కొమరం భీం, అల్లూరిలకు ఈ టాస్క్ వచ్చింది. వాళ్లిద్దరూ ఛాలెంజ్ ను స్వీకరించి మరో ఆరుగురికి ఇచ్చారు. 

 

తారక్ ఛాలెంజ్ విసిరిన చిరు, వెంకటేష్ లు తమ టాస్క్ కంప్లీట్ చేసి మరో నలుగురికి ఇచ్చారు. వెంకటేష్ ఈ టాస్క్ లో మహేష్, వరుణ్ తేజ్ లను పాల్గొనాలని ఛాలెంజ్ విసిరాడు. ఇక చిరు కూడా కె.టి.ఆర్, రజినీకాంత్, మణిరత్నంలకు ఈ ఛాలెంజ్ విసిరాడు. రాజమౌళి బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ కీరవాణిని నామినేట్ చేయగా ఆయన డైరక్టర్ క్రిష్ ను నామినేట్ చేశాడు. అయితే క్రిష్ ఈ టాస్క్ కంప్లీట్ చేసి మైండ్ బ్లాంక్ అయ్యేలా స్కెచ్ వేశాడు. అదేంటి అంటే తానూ ఈ ఛాలెంజ్ సెలబ్రిటీస్ కు కాకుండా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇచ్చాడు. 

 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా మీ ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళకు సహాయం చేయండని పిలుపు ఇచ్చాడు క్రిష్. మీరు నిజమైన పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈ ఛాలెంజ్ స్వీకరించక తప్పదు. సెలబ్రిటీస్ కు మాత్రమే కాదు క్రిష్ ట్వీట్ ద్వారా ఈ టాస్క్ కామన్ మెన్ కు ట్రాన్స్ ఫర్ అయ్యింది. మొత్తానికి ఈ లాక్ డౌన్ టైం లో ఒక మంచి పని జరుగుతుందని చెప్పొచ్చు. వకీల్ సాబ్ తర్వాత పవన్ క్రిష్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. అందుకే క్రిష్ పీకే ఫ్యాన్స్ కు ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. మరి పవన్ మీద ఉన్న ఇష్టాన్ని చూపించేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని పీకే ఫ్యాన్స్ ఎలా ప్రూవ్ చేసుకుంటారో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: