భారత రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాయకుడు శశి తరూర్. కాంగ్రెస్ నుంచి బలమైన నేతగా ఆయనకు మంచి పేరు ఉంది. కాంగ్రెస్ లో సుధీర్గ కాలం పాటు రాజకీయం చేసిన ఆయన కేంద్ర మంత్రిగా కూడా పని చేసారు. కాంగ్రెస్ లో అధిష్టానం కి ఎంతో సన్నిహిత నేతగా కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఇక ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ కూడా వివాదాస్పధమే అని అంటూ ఉంటారు. ఆయన ప్రేమ వ్యవహారాలూ రాజకీయాల తో పాటుగా సినిమాల్లో కూడా ఒక సంచలనం అని చెప్తూ ఉంటారు. 

 

ఆయన 2010 లో చేసుకున్న ఒక వివాహం ఆయన జీవితాన్ని మార్చేసింది. సునందా పుష్కర్ అనే వ్యాపారవేత్తను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయనకు అప్పటికే వివాహం అయినా సరే దాని గురించి ఎప్పుడు ఆయన బయటపెట్టిన సందర్భం ఎక్కడా కూడా లేదు. ఇక ఆయన చేసుకున్న వివాహం గురించి అంతర్జాతీయ మీడియా కూడా రాసింది. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఈ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కేవలం 4 ఏళ్ళకే వీరు ఇద్దరు విడిపోయారు. విభేదాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 

 

ఇక ఆమె ఒక హోటల్ లో మరణించిన విషయం కూడా అప్పట్లో ఒక సంచలనం. 2014 లో ఆమె మరణించారు. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ అధికారం లో లేకపోవడం తో పాటుగా శశి తరూర్ ని కేంద్ర సర్కార్ ఇబ్బందులు పెట్టడం వంటివి ఎక్కువగా జరిగాయి. ఆయన బలమైన నేత కావడం పలుకుబడి ఎక్కువగా ఉండటం తో ఆయనను ఎవరూ కూడా ఏమీ చేయలేకపోయారు అనేది కూడా వినపడుతూ ఉంటుంది. బాలీవుడ్ లో కూడా ఆయన వివాహం ఒక సంచలనం అని అంటారు. బాలీవుడ్ కి ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: