రాజకీయాల్లో సినిమాల్లో సంచలనం మరో పెళ్లి జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని, తండ్రి హరికృష్ణ వివాహం. వీరు ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకోవడం అప్పట్లో ఒక సంచలనం. వీరి వివాహంపై అప్పట్లో ఎన్నో కథనాలు వచ్చాయి. టాలీవుడ్ లో రాజకీయాల్లో ఈ వివాహం గురించి ఎందరో ఎన్నో మాట్లాడారు. ఎన్టీఆర్ కుటుంబంలో సంగీత టీచర్ గా అడుగు పెట్టిన శాలిని ప్రేమలో హరికృష్ణ పడటం ఆమెతో సన్నిహిత సంబంధాలు పెరగడం అప్పటికే లక్ష్మీ అనే ఆమెని పెళ్లి చేసుకున్నా సరే హరికృష్ణ మాత్రం ఆమెను పెళ్లి చేసుకున్నారు. 

 

హరికృష్ణ శాలిని ని ప్రేమించి పెళ్లి చేసుకునే సమయంలో జానకి రామ్, సుహాసిని ఇద్దరూ పుట్టారు కూడా. ఇక కళ్యాణ్ రామ్ కడుపులో ఉన్నాడు. అయినా సరే వాళ్ళు ఒక్కటి అయ్యారు. ఎవరు చెప్పినా సరే హరికృష్ణ మాత్రం అప్పట్లో వినలేదు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పుట్టడం తో ఈ బంధం గురించి ప్రపంచం మొత్తం తెలిసింది. అప్పటి నుంచి కొన్నాళ్ళ పాటు దూరంగా ఉన్నా సరే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు దగ్గర కావడం శాలిని కి ఆర్ధికంగా హరికృష్ణ అన్ని విధాలుగా అండగా నిలవడం వంటివి జరిగాయి. 

 

వీరి వివాహం విషయంలో ఎన్టీఆర్ కూడా అభ్యంతరం చెప్పలేదు అని అంటారు. ఎన్టీఆర్ ఎక్కడా కూడా వీరికి అడ్డు చెప్పలేదని జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన తర్వాత ఆస్తి కూడా ఇచ్చారని చెప్తారు. చిన్న విషయం జరిగితే దాన్ని ఎలాగూ పెద్దగా చూపిస్తూ ఉంటారు టాలీవుడ్ లో అయినా రాజకీయాల్లో అయినా సరే అలాగే ఈ వ్యవహారం గురించి కూడా అప్పట్లో జనాలు ఎక్కువగా మాట్లాడుకునే వారు. టాలీవుడ్ లో ఇది ఒక హాట్ టాపిక్ అప్పట్లో. కాగా హరికృష్ణ రెండేళ్ళ క్రితం జరిగిన కారు ప్రమాదంలో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: