తెలుగు చిత్ర పరిశ్రమలో ఓటమి ఎరుగని దర్శకుడుగా  సక్సెస్ ఫుల్ సినిమాలు తెరకెక్కిస్తూ దులుకుడూతున్నారు  కొరటాల శివ. ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమా బ్లాక్బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటుంది. అయితే తాజాగా కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఆచార్య గా టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా ఇప్పటికే కొంత మేర చిత్రీకరణ కూడా జరుపుకుంది. ఇక లాక్ డౌన్  కారణంగా సినిమా షూటింగ్ ను నిలిచిపోవడంతో ఈ సినిమా చిత్రీకరణ కూడా ఆగిపోయింది. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు పెరిగి పోతున్న విషయం తెలిసిందే. 

 

 

 ఇక ఈ సినిమాలో  చిరంజీవి సరసన చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ చివరికి కాజల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కు కాస్త బ్రేక్ పడటంతో... మే నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నారట. చిరంజీవి కాజల్ కాంబినేషన్లో ని సన్నివేశాలను చిత్రీకరించాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో మే 7 వరకు లాక్ డౌన్  కొనసాగుతుంది అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ  తర్వాత షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య  మే 7 తర్వాత లాక్ డౌన్  పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి అని టాక్  కూడా వినిపిస్తోంది. 

 

 

 ఇదిలా ఉంటే ప్రస్తుతం కాజల్ ముంబై లో ఉంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కాజల్ కాంబినేషన్ సీన్లను పక్కనపెట్టి ప్రస్తుతం ఇక్కడ ఆర్టిస్ట్ లతో  చిత్రీకరించాలని దర్శకుడు కొరటాల శివ బావిస్తున్నారట . కాగా పరిస్థితులన్నీ కుదుటపడిన తర్వాత కాజల్ చిరంజీవి మధ్య ఉండే సన్నివేశాలను చిత్రీకరించాలని భావిస్తున్నారట. షూటింగు మరి ఎక్కువ లేట్ అయితే ఇబ్బందులు ఎదురవుతాయని ఉద్దేశంతో దర్శకుడు కొరటాల శివ ఇలా ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: