పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల మధ్య ఎంత స్నేహం ఉందో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటి వరకు మూడు చిత్రాలు వచ్చాయి. మొదటి చిత్రం జల్సా హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ సెన్సేషనే. జల్సా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ కి మళ్లీ సూపర్ హిట్ అత్తరింటికి దారేది సినిమాతోనే వచ్చింది. ఆ తర్వాత వచ్చిన అజ్ఞాతవాసి చిత్రం యావరేజిగా నిలిచింది.

 

అయితే పవన్ కళ్యాణ్ గురించి త్రివిక్రమ్ ఎప్పుడు మాట్లాడిన చాలా ఆసక్తిగా ఉంటుంది. వీరిద్దరి స్నేహంలో జరిగిన సంఘటనల్ని చెప్తున్నపుడు అభిమానులు చాలా ఆసక్తిగా వింటుంటారు. త్రివిక్రమ్ అనే కాదు ఎవ్వరైనా పవన్ కళ్యాణ్ గురించి చెప్తుంటే అలా వింటూ ఉండిపోతారు. పవన్ కళ్యాణ్ స్వతాహాగా తన గురించి తాను చెప్పుకున్నది లేదు కాబట్టి, వేరే వాళ్లు పవన్ గురించి చెబుతుంటే శ్రద్ధగా వింటారు.

 


పవన్ కళ్యాణ్ చాలా తక్కువ మందితో స్నేహం చేస్తాడు. పవన్ తో క్లోజ్ గా ఉన్న ఇండస్ట్రి వాళ్ళు చాలా తక్కువ. అయితే పవన్, త్రివిక్రమ్ ల మధ్య స్నేహం కుదరకముందు జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి ఇలా వివరించాడు త్రివిక్రమ్. జల్సా సినిమాకి ముందు త్రివిక్రమ్ ఒకసారి కథ చెబుదామని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లాడట.

 

త్రివిక్రమ్ కథ చెబుతుంటే పవన్ కళ్యాణ్ వింటూ నిద్రపోయాడట. అది గమనించిన త్రివిక్రమ్ పవన్ ని డిస్టర్బ్ చేయకుండా మెల్లగా వచ్చేశాడట. అప్పుడు త్రివిక్రమ్ ఏ కథ వినిపించాడో తెలియదు గానీ, వీరిద్దరి మధ్య స్నేహం కుదిరి చాలా మంచి చిత్రాలు వచ్చాయి.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వారి కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: