టాలీవుడ్ లో వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ మూవీలో నత్తిగా మాట్లాడుతూ అందరి దృష్టి ఆకర్షించిన నయనతార తర్వాత టాప్ హీరోయిన్ గా మారింది. చంద్రముఖి తర్వాత గజినీ సూపర్ హిట్ కావడంతో తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు దక్కించుకుంది. దాదాపు తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో స్టార్ హీరోలందరితో నటించింది నయనతార. అంతే కాదు ఈ అమ్మడు సినీ రంగప్రవేశం చేసి పదేళ్లు దాటినా.. ఇప్పటికే ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. దక్షిణాదిన ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ నయన్. తెలుగు లో అయితే బాలకృష్ణ - నయనతార కాంబినేషన్ లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
గత ఏడాది మెగాస్టార చిరంజీవి సరసన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించింది. ఈ మద్య లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఒకప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన 'నరసింహా' సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో 'నీలాంబరి'గా రమ్యకృష్ణ చేసిన పాత్ర ఆమె కెరియర్లో చెప్పుకోదగిన పాత్రగా మిగిలిపోయింది. ఇప్పటికీ నీలాంబరి అంటే ఓ పొగరు బోతు.. పవర్ ఫుల్ క్యారెక్టర్ గానే సినీ ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. తాజాగా ఈ తరహా పాత్రలో నయనతార కనిపించనుందని తెలుస్తోంది.
తమిళంతో పాటు తెలుగు, మలయాళ సినిమాలతోను నయనతార బిజీగా వుంది. ఈ మద్య మాలీవుడ్ లో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కి నయన్ సైన్ చేశారట. ఈ సినిమాలో 'నీలాంబరి' తార పాత్రను చేయడానికి దర్శక నిర్మాతలు నయనతారను ఎంపిక చేసుకున్నారు. సొంత గడ్డపై సినిమా అనే సరికి నయనతార ఆ పాత్రను చేయడానికి వెంటనే అంగీకరించిందని అంటున్నారు. ఈ మద్య ప్రమోషన్స్ విషయంలో కూడా నయన్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ ఎంత వరకు హిట్ అవతుందో చూడాలి.