సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ రికార్డైనా అక్కడ నమోదు కావాల్సిందే. సోషల్ మీడియా, యూ ట్యూబ్ రికార్డులే ఇప్పుడు ఓ సినిమాకు, పాట సాధించిన విజయాలకు కొలమానం. టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్.. ఇలా ఏదైనా యూ ట్యూబ్ లో రికార్డులు మోగితేనే బజ్ క్రియేట్ అయ్యేది. అంతగా ఈరోజుల్లో సోషల్ మీడియా వేళ్లూనుకుంది. ప్రస్తుతం అలాంటి ఓ అరుదైన రికార్డునే మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన సినిమాలోని ఓ పాట చేరుకుంది.

 

 

ఉప్పెన లోని ‘నీ కన్ను నీలి సముద్రం..’ అనే లిరికల్ సాంగ్ ఆమధ్య విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ పాట సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం ఈ పాట యూ ట్యూబ్ లో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. మార్చి 2న విడుదలైన ఈ పాట ఇప్పటికి ఏకంగా 40 ప్లస్ మిలియన్ల వ్యూవర్ షిప్ సాధించి ఇంకా దూసుకుపోతోంది. ఈ మేరకు పాట సాధించిన రికార్డును బిఏ రాజు తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆకట్టుకుంటోంది. శ్రీమణి, రకీబ్ ఆలమ్ అందించిన సాహిత్యం కూడా పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది.

 

 

పాట ఆద్యంతం అందమైన ప్రేమకథను తలపిస్తోంది. సముద్రం బ్యాక్ డ్రాప్, వైష్ణవ్ తేజ్ రఫ్ లుక్, కృతి శెట్టి అందం, అభినయం ఈ పాట రికార్డులు క్రియేట్ చేయడంలో కీలకపాత్ర పోషించాయని చెప్పాలి. ఏప్రిల్ 2నే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడింది. తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: