ఫిదా సినిమా తో  టాలీవుడ్ లో అడుగుపెట్టి అందరినీ ఫిదా చేసింది సాయి పల్లవి.  ఆ సినిమాలో అల్లరి పిల్లగా అందరిని ఆకట్టకుంది. ఆ సినిమా సాయి పల్లవి ని టాలీవుడ్ లో అగ్ర కథానాయిక గా నిలబెట్టింది. అయితే సాయి పల్లవి. ఈ సినిమా తరువాత వరుస ఆఫర్లు వచ్చినా ఆమె కంగారు లేకుండా మంచి పాత్రలను ఎంచుకుంటుంది. ఇప్పుడు ఆమె తెలుగులో కొన్ని సినిమాలు చేస్తున్నా విరాట పర్వం సినిమాలో ఒక సీనియర్ నటి తో పోటిపడనుంది.


కరోనా కారణంగా అన్ని సినిమా షూటింగ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ తర్వాత అన్ని షూటింగులు శరవేగంగా జరుగుతాయి. దీనిలో భాగంగా సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న విరాట పర్వం సినిమాకి దర్శకుడు వేణు ఉడుగుల దర్సకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి పల్లవి కి దీటుగా ఉన్న వేరే పాత్ర కోసం సీనియర్ నటి ప్రియ మణి ని ఎంపిక చేసినట్టు టాలీవుడ్  సమాచారం. . మాజీ నక్సలైట్  గా సాయి పల్లవి చాలా సాధారణంగా కనపడుతుంది. 

 

ఆమెకు పోటీగా ప్రియ మణి తన నటన తో  సాయి పల్లవి కి గట్టి పోటీ ఇస్తుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఒక ముఖ్యమైన పాత్రలో దగ్గుపాటి  రానా ఈ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం. సాయి పల్లవి ఇండస్ట్రీకి వచ్చి రాగానే అగ్ర హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఎక్కువగా అందాలు ఆరబోయక పోయినా  కాజల్, సమంతల రేంజ్లో అభిమానుల్ని సపాదించుకుంది. మరి ఈ విరాట పర్వం సినిమా సాయి పల్లవి ఇమేజ్ ని ఏ రేంజ్ లో నిలబెడుతుంది అనేది చూడాలి. ఇక ఈ సినిమా తో ప్రియ మణి ప్రతి నాయికగా ఎలా మెప్పిస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: