టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన అతడు సినిమా అద్భుత విజయంతో ఓవర్సీస్ లో మంచి మార్కెట్ దక్కించుకున్నారు. ఒకరకంగా ఆ సినిమా తరువాతనే ఓవర్సీస్ లో మన తెలుగు సినిమాల హవా మొదలయిందని సినీ విశ్లేషకులు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. మంచి కథ, కథనాలతో యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమా అద్భుత విజయాన్ని అందుకోవడంతో పాటు హీరో మహేష్ కు, దర్శకుడు త్రివిక్రమ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ ఈ సినిమా టెలివిజన్ లో ప్రసారం అయితే దానికి వచ్చే రేటింగ్స్ అద్భుతంగా ఉంటాయంటే ఆ సినిమా క్రేజ్ ఎటువంటిదో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. 

 

ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండవ సినిమా ఖలేజా. మహేష్ బాబులోని ఫుల్ లెంగ్త్ కామెడీ యాంగిల్ ని ఈ సినిమా ద్వారా బయటకు తీశారు త్రివిక్రమ్. వాస్తవానికి ఈ సినిమాలో మహేష్ బాబు యాక్షన్ కి థియేటర్స్ లో ఫిదా కాని ప్రేక్షకుడు లేడనే చెప్పాలి. అయితే కథ, కథనాల పరంగా ఆకట్టుకునే రేంజ్ లో సినిమా తెరకెక్కకపోవడంతో ఖలేజా అప్పట్లో ఫ్లాప్ ని మూటగట్టుకుంది. అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మణిశర్మ అందించిన సాంగ్స్ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఈ సినిమా వచ్చి దాదాపుగా పదేళ్లు దాటుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు మరొక్కసారి మహేష్, త్రివిక్రమ్ కాంబోలో మరొక సినిమా రానే లేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఒక సినిమా కమిట్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్, దాని అనంతరం సూపర్ స్టార్ తో ఒక సినిమా చేయనున్నారని, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని నిర్మించనున్నట్లు టాక్. 

 

అయితే ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి నువ్వే నువ్వే తరువాత అతడు సినిమా చేసిన త్రివిక్రమ్ కు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన తమ హీరో మహేష్ తో నెక్స్ట్ చేయబోయే సినిమా అదిరిపోవాలని, అలానే ఫెంటాస్టిక్ సాంగ్స్, యాక్షన్, రొమాన్స్, వంటి కమర్షియల్ హంగులన్నీ అదిరిపోవాలని మహేష్ ఫ్యాన్స్ కోరుతున్నారు. అదే గనుక జరిగి వీరిద్దరి కాంబోలో మంచి హిట్ సినిమా పడితే మాత్రం, దాని ధాటికి బాక్సాఫీస్ రికార్డులు ఖతం అవడం ఖాయం అనే చెప్పాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: