ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈయ‌న‌కుండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ అయితే ఫుల్ మాస్ క్రేజ్ ఎక్కువ‌నే విష‌యం మొద‌టి నుంచి తెలిసిందే. మ‌రి వీరిద్ద‌రూ క‌లిసి ఓ చిత్రంలో న‌టిస్తే ఇక అది మాములు విష‌యం కాదు. ఫ్యాన్స్ వీరి కాంబినేష‌న్‌లో సినిమా రావాల‌ని కోరుకుంటున్నార‌ట‌. వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేయ‌డం అంటే ముందు ఎలాంటి స‌బ్జెక్ట్ అనేది చూసుకుంటే. ఎన్టీఆర్ మాస్ స‌బ్జెక్ట్‌లు చూసుకుంటేఆది, అర‌వింద్ స‌మేత‌, జ‌న‌తాగ్యారేజ్ ఇవ‌న్నీ కూడా మంచి హిట్లే. ఇక  త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌‌న్‌లో మంచి యాక్ష‌న్  సినిమా తీసుకుంటే ఇక ప‌వ‌న్‌కళ్యాణ్ అత్తారింటికి దారేది, జ‌ల్సా వంటి ల‌వ్ అండ్ సెంటిమెంట్ క‌ల‌గ‌లిపిన సినిమా అయితే బావుంటుంది. 

 

ఇటు మాస్ ఆడియ‌న్స్ క్లాస్ ఆయ‌న్స్ ఇద్ద‌రూ  కూడా ఫుల్ హ్యాపీ ఫీల‌వుతారు. ఎందుకంటే ఇద్ద‌రికీ కూడా మాస్ ఆడియ‌న్స్‌లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది.  ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో క‌థ‌ను సెట్ చెయ్య‌డం అంటే అది కేవ‌లం ప‌వ‌న్ కు మాత్ర‌మే సాధ్య‌ప‌డుతుంది. ఎందుకంటే అర‌వింద్ స‌మేత చిత్రం మొద‌ట ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేయ‌వ‌ల‌సిన చిత్రం కానీ ఆ చిత్రం తార‌క్ అయితే బావుంటుంద‌ని ప‌వ‌న్ స‌జ‌స్ట్ చేయ‌బ‌ట్టే అర‌వింద‌స‌మేత చిత్రం ఎన్టీఆర్ చేశారు. ఇక ప‌వ‌న్‌ను ఇలా చూపించేసి క్లైమాక్స్ వ‌చ్చస‌రికి ఒక అత్తారింటికి దారేది, జ‌ల్సా క్ల‌యిమాక్స్ లాంటివి అయితే త్రివిక్ర‌మ్ అయితే బాగా చేయ‌గ‌ల‌డు. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్టీఆర్‌ని కూడా ఇలా తీసుకోవ‌చ్చు. 

 

ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా ప‌వ‌న్ ఓకే చేసిన సినిమాలు కాస్త ఆగాయి. వ‌కీల్‌సాబ్ దాదాపు షూటింగ్ అంతా పూర్త‌యి ఒక్క షెడ్యూల్‌లో బ్రేక్ ప‌డింది. అలాగే క్రిష్ చిత్రం కూడా షూటింగ్ మొద‌లై రెండు షెడ్యూల్స్‌ని పూర్తి చేస‌కున్నారు. లాక్‌డౌన్ పూర్త‌యితేగాని తిరిగి మ‌ళ్ళీ షూటింగ్‌లు మొద‌ల‌వ్వ‌వు. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా ఆర్‌.ఆర్‌.ఆర్ మూవీకి బ్రేక‌ప్ ఇచ్చి లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటిప‌ట్టునే ఉంటున్నారు. ఇద‌వ్వ‌గానే ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: