ప్రతిష్టాత్మక చిత్రం అయిన బాహుబలి సినిమా అనంతరం ప్రభాస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు సాహో సినిమాతో వచ్చాడు. కానీ సాహో సినిమాకి అనుకున్న స్థాయిలో గుర్తింపు లభించే లేకపోయింది. ఇక ప్రభాస్సినిమా తర్వాత జిల్ ఫేమ్ 'రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ డియర్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయం ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. ఇక మహానటి సినిమా వంటి సూపర్ హిట్ దక్కించుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయాలనుకున్నాడు. ఇక ఈ సినిమాలో ఎవరిని హీరోయినుగా తీసుకోవాలన్నది చిత్ర యూనిట్ లో చర్చ కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. 

 


ఇక నాగ అశ్విన్, ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో సినిమాని రుపుదిద్దుతున్నారు. అంతే కాకుండా ఈ సినిమాని అన్ని ప్రధాన భాషలలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అలాగే సినిమాలోని కీలక పాత్రల కోసం బాలీవుడ్ స్టార్ హీరో లను కూడా ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే... ఈ సినిమాకి హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలావరకు ఈ సినిమాకి ఈమె హీరోయిన్ అని కన్ఫామ్ కూడా చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ ఉండడంతో ఎటువంటి ప్రచారాలు లేవు. అయితే ఒకసారి లాక్ డౌన్ పూర్తి అయిన తర్వాత చిత్ర యూనిట్ ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. 

 


ఇక ఈ సినిమాని సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో.. 50 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇది ఇలా ఉండగా ప్రభాస్, కైరా జంట బాగుంటుందని, అంతేకాకుండా సాహో తర్వాత  ప్రభాస్ కు ఈ సినిమా సూపర్ హిట్ సినిమాగా నిలుస్తుందని సినీ ప్రముఖులు వెల్లడిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: