ప్రస్తుతం టాలీవుడ్ లో చాలెంజ్ పర్వం నడుస్తోంది అని చెప్పవచ్చు. అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో మొదలైన ఈ చాలెంజ్ పర్వం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం పాకింది అని చెప్పవచ్చు. దీనిలో ఒకరు ఛాలెంజ్ చేసిన తర్వాత వారు మరో ఇద్దరు లేదా ముగ్గురు కి చాలెంజ్ చేయడం ద్వారా ఈ చాలెంజ్ ఆట టాలీవుడ్ లో బాగా ట్రెండింగ్ గా సాగుతోంది. 

 

అయితే ఇదే విషయంపై ప్రముఖ దర్శకుడు కొరటాల శివ " బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్" ని హీరో విజయ్ దేవరకొండ కి ఛాలెంజ్ ఇచ్చాడు. అయితే ఈ దర్శకుడు ఇచ్చిన ఛాలెంజ్ ని విజయ్ దేవరకొండ స్వీకరిస్తూ కొద్దిసేపటి క్రితం తన సంబంధించిన వీడియోని అతడు ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. అయితే ఇందులో హీరో విజయ దేవరకొండ తన రోజువారీ కార్యక్రమాల్ని క్లియర్ గా చూపించాడు. దాదాపు లాక్ డౌన్ సందర్భంగా తొమ్మిది గంటలు నిద్ర పోతున్న తర్వాత తాను లేవగానే వైన్ బాటిల్స్ ని శుభ్రపరిచి వాటిని వాటర్ బాటిల్స్ గా ఉపయోగిస్తూ అందులో నీటిని నింపి ఫ్రిజ్ లో పెట్టడం జరిగింది. అలాగే ఆ తర్వాత ప్రతి రోజు ఉదయాన్నే ఒక లీటర్ నీటిని తాగడం మంచిదని చెబుతూ నీటిని తాగాడు. ఇక ఆ తరువాత ఏదైనా పాత కవర్స్ ని చెత్త బుట్టల కోసం ఎలా ఉపయోగించాలని ఆ వీడియోలో తెలిపాడు.

 


ఆ తర్వాత ఫ్రెండ్ చెప్పాడని మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేసి తమ కుటుంబ సభ్యులకి అందించాడు. అంతేకాకుండా టీవీని తుడిచి గేమ్ కూడా ఆడాడు. ఇక చివరగా ఇది తన లాక్ డౌన్ జీవన ప్రక్రియ అని వీడియో ద్వారా తన సందేశాన్ని తెలిపాడు. అలాగే చివరగా ఈ సంక్షోభ సమయంలో మనం తోటి వారికి అండగా నిలవాలని చెప్పుకొచ్చాడు. ఇక చివరగా ఈ చాలెంజ్ ని దుల్కర్ సల్మాన్ కి విసిరాడు విజయ్ దేవరకొండ.

మరింత సమాచారం తెలుసుకోండి: