ప్రపంచంలో కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వల్ల కేవలం మనిషి ప్రాణాలకు మాత్రమే కాదు.. ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బ తింటుంది.  కరోనా వల్ల ఎన్నో సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి.. సినిమా రిలీజ్ లు వాయిదా పడ్డాయి.  దాంతో సెలబ్రెటీలు అంతా ఇంటికే పరిమితం అయ్యారు.  కొంత మంది దూరంగా ఉన్నావారు మాత్రం తమ ఐనవారిని గుర్తు చేసుకొని తెగ బాధపడిపోతున్నారు.  తాజాగా టాలీవుడ్ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా సోద‌రుడు ఆనంద్‌ కూడా లాక్‌డౌన్ వ‌ల‌న అమెరికాలో ఇరుక్కుపోయాడు. ఈ సంద‌ర్భంగా త‌మ్మూ.. త‌మ్ముడితో దిగిన పాత ఫోటోని షేర్ చేస్తూ .. ‘ఆరోజుల్లో ఇద్దరం చాలా గొడవపడేవాళ్లం. మిస్‌ యు ఆనంద్‌ భాటియా’ అంటూ తన సోషల్ మాద్యమంలో పోస్ట్ చేసింది.

 

లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికి ప‌రిమిత‌మైన ఈ అమ్మ‌డు ఇంట్లో వెరైటీ వంట‌కాలు చేస్తూ వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  అప్పట్లో తెలంగాణ యాస అప్ప‌ట్లో విజ‌య‌శాంతికి మంచి గుర్తింపుతో పాటు నంది పుర‌స్కారాన్ని కూడా అందించింది. అదే యాస‌తో తొలి సినిమాతోనే మ్యాజిక్ చేసింది సాయి ప‌ల్ల‌వి. ఆమె న‌టించిన `ఫిదా` మూవీ భానుమ‌తి హైబ్రీడ్ పిల్ల అంటూ ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేసిన విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న విష‌యం తెలిసిందే.

 

తాజాగా ఇప్పుడు తమన్నా కూడా అచ్చమైన తెలంగాణ యాసలో మాట్లాడబోతుందట. గోపీచంద్ హీరోగా న‌టిస్తున్నారు. సంప‌త్‌నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ త‌మ‌న్నా క‌బ‌డ్డీ కోచ్‌గా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తోంది.  తెలంగాణ యాస‌లో ఆమె స్లాంగ్ వుంటుంద‌ట‌. ఈ భాషపై ప‌ట్టు సాధించ‌డం కోసం త‌మ‌న్నా భారీ క‌స‌ర‌త్తులే చేస్తోంది. మరి తెలంగాణ యాసతో ఈ మిల్కీ బ్యూటీ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. లాక్ డౌన్ పూర్తి కాగానే షూటింగ్ మొదలు పెడతారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: