టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోల తనయులు స్టార్ హీరోలుగా ఎదిగారు.  తెలుగు, తమిళంలో వారసులు మాత్రమే వస్తున్నారు.  బాలీవుడ్ లో ఇప్పటికే స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. కపూర్ ఫ్యామిలీ నుంచి కరిష్మా, కరీనా కపూర్ లో వచ్చారు.  అనీల్ కపూర్ తనయ సోనమ్ కపూర్, శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షీ సిన్హా, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ లు హీరోయిన్లు గా పరిచయం అయ్యారు. ఇక విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ హీరోయిన్ గా పరిచయం అయిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ అమ్మడు మంచి హిట్ సినిమాల్లో నటించింది.

 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా రామయ్యా వస్తావయ్యా. సమంత, శృతి హాసన్ హీరోలుగా నటించారు. ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకు సంగతం అందించారు.  ఈ మూవీ తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ రాలేదు.  తెలుగు లో శృతి హాసన్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సరసన గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలో నటించింది. ఆ మద్య ఈ అమ్మడు సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే.  తాజాగా రవితేజ నటిస్తున్న ‘క్రాక్’ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది.  

 

త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయడానికి సిద్ధమవుతున్నాడు. 'అరవింద సమేత' తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ కి త్రివిక్రమ్ తుది మెరుగులు దిద్దుతున్నాడు. కథాపరంగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందట. జాన్వీకపూర్,  పూజ హెగ్డే పేర్లు వినిపించాయి. తాజాగా శ్రుతి హాసన్ పేరు తెరపైకి వచ్చింది. గతంలో ఎన్టీఆర్ సరసన ‘రామయ్యా వస్తావయ్యా' చేసిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: