మన తెలుగులో సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చిన్న సినిమా వచ్చినా చాలు ప్రేక్షకులు పనులు మానుకుని మరీ సినిమాకు వెళ్ళే పరిస్తితి ఉంటుంది. అగ్ర హీరోల సినిమాలు అయితే ఇంకాస్త ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోల సినిమాలకు ఇంకాస్త క్రజ్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మన తెలుగులో వీరు అందరూ బిజీ గా ఉన్నారు. ఇక ఇప్పుడు వీరి అందరితో బాలీవుడ్ సినిమాలను చెయ్యాలని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అని సమాచారం. 

 

ముందు జూనియర్ ఎన్టీఆర్ ని సెట్స్ మీదకు బాలీవుడ్ లో తీసుకుని వెళ్ళాలి అని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని అక్కడ పరిచయం చెయ్యాలని అలాగే మహేష్ బాబు తో సినిమా చెయ్యాలని ఆయన ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం మన తెలుగు హీరోలకు క్రేజ్ ఎక్కువగా ఉండటం తో మార్కెట్ కూడా క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీనితో వారి తో సినిమా చేస్తే దక్షిణాది లో బాగా ప్లస్ అవుతుంది అని నిర్మాతలు భావిస్తున్నారు. మన వాళ్లకు తమిళంలో కాస్త క్రేజ్ తక్కువగా ఉంటుంది. 

 

అయితే తెలుగు వాళ్ళు ఎక్కడ చూసినా ఉన్నారు కాబట్టి వారి తో సినిమాలు చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం కరణ్ జోహార్ వ్యక్తం చేస్తున్నారు. చిన్న హీరోలకు కూడా మంచి ఆదరణ ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు మన తెలుగు హీరోలను బాలీవుడ్ లో పరిచయం చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అక్కడి హీరోను తెలుగులో కూడా పరిచయం చేసి ఇక్కడి స్టార్ హీరో తో ఒక సినిమా చేయిస్తే మార్కెట్ రెండు చోట్లా ఉంటుంది అనే భావన లో ఆయన ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: