ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం రాను రాను మనిషి ఆలోచనల్లో రకరకాలుగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎంత ఎక్కువగా టెక్నాలజీ అనేది రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతుందో, అదే మాదిరిగా దాని ద్వారా మనిషి కొంతమేర అయితే లాభాన్ని పొందుతున్నప్పటికీ, మరికొంత విచిత్ర ఆలోచనలు చేస్తూ తనను తానే కొంత పలుచన చేసుకుంటున్నాడని అని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా మాధ్యమాల వినియోగం నేటి కాలంలో విపరీతంగా పెరిగిపోవడం, ప్రతి ఒక్కరికీ కూడా సెల్ ఫోన్, ఇంటర్నెట్ ధరలు అందుబాటులోకి రావడంతో దాదాపుగా అందరూ ఎవరికి నచ్చిన విధంగా వారు పోస్టులు పెట్టడం చేసేస్తున్నారు. 

IHG

ఇక ఇటీవల కొన్నాళ్లుగా కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో మన దేశాన్ని కూడా కొన్ని వారాల పాటు మన దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దానితో అందరు ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవడం, తద్వారా అన్ని రంగాలు కూడా పూర్తిగా మూత పడడం జరిగింది. ఇక అలానే సినిమా షూటింగ్స్ కూడా బంద్ కావడంతో నటీనటులు కూడా ఇళ్లలోనే ఉంటూ తమ వ్యక్తిగత జీవితాలకు సంబందించిన పలు సమాచారాలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రజలు, అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ లాక్ డౌన్ తరువాత ఇటీవల సోషల్ మీడియాలో ఎంతో పాపులరైన ఛాలెంజుల్లో క్వారంటైన్ పిల్లో ఛాలెంజ్ కూడా ఒకటి అనే చెప్పాలి. పిచ్చి పలు రకాలు అన్నట్లుగా ఈ వింత ఛాలెంజ్ ప్రస్తుతం మంచి జోరుగా ముందుకు దూసుకెళుతోంది.

 

ఇప్పటికే ఈ ఛాలెంజ్ లో పలువురు హీరోయిన్లు పాల్గొని, పిల్లో మాదిరిగా ఉండే డ్రెస్ వేసుకుని వాటిని తమ అకౌంట్స్ లో పోస్ట్ చేసి అభిమానులకు మంచి కిక్ ఇవ్వడం జరిగింది. ఒంటిమీద మరెటువంటి బట్టలు లేకుండా, కేవలం పిల్లో మాదిరిగా ఉండే డ్రెస్ వేసుకుని, నేడు అదే పిల్లో ఛాలెంజ్ ని పూర్తి చేసిన టాలీవుడ్ స్టార్ నటి తమన్నా భాటియా, కాసేపటి క్రితం తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఇటువంటి ఛాలెంజ్ లు కూడా ఉంటాయని తెలియని కొందరు, ఏంటిది బట్టలు లేక తమన్నా దిండు కప్పుకుంది అంటూ కామెంట్స్ చేస్తుండగా, అదేం లేదు, అదొక ఛాలెంజ్ లో భాగంగా ఆమె వేసుకున్న డ్రెస్ అంటూ వారికి మరొకొందరు వివరణ ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: