అతి చిన్న వయసులో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తనదైన స్టయిల్ లో వరుస విజయాలను సొంతం చేసుకుని అగ్ర కథా నాయకుడిగా ఎదిగాడు జూనియర్ ఎన్ టి ఆర్. జూనియర్ ఎన్ టి ఆర్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. తెలుగులో ఎన్ టి ఆర్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిన సంగతే. ఎన్ టి ఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజ మౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో కలిసి అలరించనున్నాడు.

 

 దేశం మొత్తం కరోన కారణంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో అన్ని సినిమా షూటింగ్ లు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆర్.ఆర్.ఆర్ సినిమా కూడా షూటింగ్ కూడా వాయిదా పడింది. ఈ సినిమా 80 శాతం షూటింగ్ పూర్తైంది. అయితే ఎన్ టి  ఆర్ ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెట్టినట్లు సినీ వర్గాల సమాచారం. దర్శకుడు త్రివిక్రమ్ , ఎన్ టి ఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా రానుంది. అయితే ఇది వరకు వీరి జోడిలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా భారీ హిట్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

 

తాజాగా వీరు చేయబోయే సినిమాకు నందమూరి కళ్యాణ్ రాం, ఎస్. రాధాకృష్ణ జతగా నిర్మించనున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమా తెర పైకి రానుంది. ఇక పోతే ఈ సినిమాకు కథానాయిక ను వెతికే పనిలో దర్శక, నిర్మాతలు ఉన్నారు. ఇందులో కథానాయిక గా ఇప్పటి వరకు పూజా హెగ్డే, కియారా అద్వానిల పేర్లు పరిశిలించారు. అయితే ఇప్పుడు శృతి హాసన్ పేరు కూడా చిత్ర బృందం లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. గతంలో ఎన్ టి ఆర్, శృతి హాసన్ జంటగా రామయ్య వస్తావయ్యా  చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. మళ్ళి ఈ జోడి ఈ సినిమాలో అలరిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: