కీర్తి సురేష్ సౌత్ ఇండియా లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది. అందాల నటి సావిత్రి జీవిత బయోపిక్ ‘మహానటి’ సినిమా తో సౌత్ ఇండియా లో మంచి పాపులారిటీ సంపాదించింది. మహానటి సినిమా లో కీర్తి సురేష్ కాకుండా మరొక హీరోయిన్ నటిస్తే.. ఆ సినిమా హిట్ అయ్యేది కాదని, ‘మహానటి’ సినిమా చూస్తున్నంతసేపు కీర్తి సురేష్ కాకుండా హీరోయిన్ ‘సావిత్రి’ కనబడటం జరిగిందని చాలా మంది స్టార్ హీరోలు ప్రశంసించడం జరిగింది. ఆ తర్వాత దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర కి సంబంధించిన సినిమా 'కథానాయకుడు' లో అవకాశం వచ్చినా కీర్తి సురేష్ ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించింది.

 

ఇటువంటి టైం లో తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో లెజెండ్రీ హీరోయిన్, తెలుగు నటుడు నరేష్ తల్లి, సూపర్ స్టార్ కృష్ణ భార్య దివంగత విజయనిర్మల బయోపిక్ తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట. ఈ సందర్భంగా నరేష్... కీర్తి సురేష్ ని తీసుకోవాలని తన తల్లి పాత్రకు కీర్తి అయితేనే న్యాయం చేయగలుగుతుందని నరేష్ నమ్ముతున్నారట. తెలుగు సినిమా రంగములో విజయ నిర్మల దర్శకురాలిగా, హీరోయిన్ గా ఎంతో పేరు సంపాదించారు. ఆమె ఇటీవల మరణించడం జరిగింది.

 

దీంతో తన తల్లి బయోపిక్ ఇప్పుడు తీయాలని నటుడు నరేష్ నిర్ణయించుకున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. కానీ 'మహానటి' సినిమా తరువాత కీర్తి సురేష్ ఇక తాను బయోపిక్ లు చేయనని చెప్పిన సంగతి తెలిసిందే. విజయ నిర్మల లాంటి గొప్ప నటి, దర్శకురాలి బయోపిక్ లో నటించడమంటే కీర్తి సురేష్ మరింత కీర్తిని గడించడమే అని చెప్పుకొచ్చు. ఈ సినిమా కోసం కీర్తి సురేష్ ఓకే అయితే కోటానుకోట్లు ఇవ్వటానికి కూడా భారీగా ఆఫర్ చేస్తున్నారు. మరి కీర్తి సురేష్ అన్ని కోట్లకు టెంప్ట్ అయి ఓకే చెబుతుందో లేదో చూడాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: