టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే స్టార్ హోదాని తెచ్చుకుంటున్న దర్శకులలో మారుతి కూడా ఒకరు. మారుతి స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోయినా ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. మొదటి సినిమా అయిన ఈ రోజుల్లో తోనే ఆ గుర్తింపు వచ్చేసింది. అందుకే స్టార్ హీరోలతో సినిమాలు చేయకుండానే స్టార్ డైరెక్టర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆయన కెరీర్లో భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతి రోజూ పండగే వంటి బ్లాక్ బస్టర్లు ఉన్నాయి.

 

మొన్నటికి మొన్న సాయి ధరత్ తేజ్ హీరోగా తెరకెక్కించిన ప్రతిరోజూ పండగే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. రాశీఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో చావుకి దగ్గరపడుతున్న వ్యక్తి జీవితంలో ప్రతీరోజూ పండగలా ఉండాలని చూపించాడు. ఇందులో హీరో పాత్ర కన్నా బాగా పేలిన పాత్ర రావు రమేష్ దే. సినిమాకి రావు రమేషే హీరోనేమో అన్నంత బాగా తీర్చిదిద్దాడు మారుతి. మారుతి ఇప్పటి వరకు రాసిన క్యారెక్టర్లన్నింటిలో ది బెస్ట్ అని చెప్పవచ్చు.

 


అయితే ఈ సినిమా తర్వాత మారుతి మళ్లీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ నే తెరకెక్కిస్తాడట. మొదట్లో యూత్ ని ఆకర్షించే విధంగా సినిమాలు తీసిన మారుతి, కొంచెం శృతి మించిన జోకులు కూడా పెట్టేవాడు. కానీ వాటివల్ల ఎక్కువ కాలం నిలబడలేం అనుకున్నాడో ఏమో రూటు మార్చి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ల మీద పడ్డాడు. మారుతి రాబోయే సినిమాకి స్క్రిప్టు పనులు జరుగుతున్నాయట.

 

ఈ సినిమాలో మారుతి ఉమ్మడి కుటుంబాల ప్రాధాన్యతని చూపించబోతున్నాడట. ఈ స్క్రిప్టు అల్లు అర్జున్ కి బాగా సూటవుతుందని అంటున్నాడు. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మారుతి తెరకెక్కించబోయే చిత్రాన్నియూవీ క్రియేషన్స్,  జి ఏ 2 సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి అల్లు అర్జున్ కి సూటయ్యే కథలో ఏ హీరో చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: