జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యాంకర్ రష్మి గౌతమ్ తన వాక్చాతుర్యంతో, అందచందాలతో ఎంతోమందిని రెండు దశాబ్దాలపాటు అలరిస్తుంది. అడపాదడపా సినిమాల్లో కూడా నటిస్తోంది. ఎవరితోనూ ఏ వివాదం పెట్టుకోకుండా తన పని తాను చేసుకుంటోంది. సామాజిక స్పృహ ఉన్న రష్మి గౌతమ్ అన్ని విషయాల పై స్పందిస్తుంది. ముఖ్యంగా ఆమెకు జంతువులంటే మహా ప్రాణం.

 

ప్రస్తుతం భారతదేశం అంతటా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో జనాలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దాంతో ఆహారం అందించడానికి ఎవరూ లేక వీధిలో బతుకుతున్న శునకాలన్నీ ఆకలితో అలమటిస్తున్నాయి. చాలామంది జంతు ప్రేమికులు శునకాలకి ఆహారం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే రష్మి గౌతమ్ కూడా తనవంతుగా శునకాలకి ఆహారం అందిస్తుంది. మూగ జీవులను ఎలా చూసుకుంటారనే దానిని బట్టే ఒక మనిషి యొక్క మనసు ని అంచనా వేయబడుతుంది. దీన్ని బట్టి చూస్తే రష్మి గౌతమ్ మనసు ఎంత మంచిదో స్పష్టంగా అర్థమవుతుంది. మానవులు మూగజీవాలైన కుక్కలకు హాని తలపెడితే తాను ఎంతో చలించిపోతుంది. మానవుడికి ఏ హాని తలపెట్టకుండా ఓ ముద్ద వేస్తే ఎంతో విశ్వాసంగా మెలిగే శునకాలను కొంతమంది దుర్మార్గులు హింస పెడుతుంటారు.

 

అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో తెలియని నీచమైన నికృష్టమైన మనుషులు కుక్కలని అన్యాయంగా చంపుతున్నారు. ఇవన్నీ రష్మి గౌతమ్ ప్రతిరోజు చూస్తూనే ఉంటుంది, ఏడుస్తూనే ఉంటుంది. తన అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ శునకాలను రక్షించమని వేడుకుంటుంది. ఇప్పటికే తాను తన వేలమంది ఇంస్టాగ్రామ్ అభిమానులను ప్రేరేపించి శునకాలకు ఆహారం అందించేలా చేస్తుంది. బహుశా తెలుగు సినీ పరిశ్రమలో రష్మీ లాంటి గొప్ప జంతు ప్రేమికులు ఎవరూ ఉండరేమో. ఏది ఏమైనా ఇన్సైడ్ అవుట్ బ్యూటిఫుల్ గా ఉండే రష్మి గౌతమ్ నిండు నూరేళ్లు ఆనందంగా బతకాలని అందరం కోరుకుందాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: