అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న పుష్ప లో
నివేత థామస్,
బన్ని లవర్ గా కనిపించనుందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే చిత్ర వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఈసినిమాలో అసలు సెకండ్
హీరోయిన్ పాత్రే లేదట. కేవలం
రష్మిక మందన్న మాత్రమే సోలో
హీరోయిన్ గా కనిపించనుంది.
నివేత రెండో
హీరోయిన్ గా నటించనుందని వచ్చిన వార్తల్లో నిజం లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం నివేత థామస్ తెలుగులో పవర్ స్థార్
పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ లో కీలక పాత్రలో నటిస్తుంది. ఆ సినిమాలో ఆమె నటన హైలైట్ కానుందని సమాచారం.
ఇక పుష్ప విషయానికి వస్తే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గాక షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బన్ని లారీ డ్రైవర్ గా కనిపించనుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు ఈ చిత్రంలో బన్ని , రష్మిక చిత్తూరు స్లాంగ్ లో డైలాగులు చెప్పనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ సింహ , కన్నడ నటుడు రాజ్ దీపక్ శెట్టి విలన్ పాత్రల్లో నటించనున్నారు. ఈఏడాది చివర్లో ఈసినిమాను విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక బన్నికి సుకుమార్ తో ఇది మూడో సినిమా. గతంలో వీరి కాంబో లో వచ్చిన ఆర్య సూపర్ హిట్ కాగా ఆర్య 2 యావరేజ్ అనిపించుకుంది. మరి పుష్ప వీరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ చిత్రం తరువాత అల్లు అర్జున్, ఐకాన్ లో నటించనున్నాడు. ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు.