ఏది ఎలా ఉన్నా సరే మన తెలుగులో ఏదైనా సినిమాలో అవకాశం ఇవ్వాలి అంటే జనం ఎక్కువగా చూసేది మాత్రం ఫాలోయింగ్. కీలక పాత్రలకు నటులను ఎంపిక చెయ్యాలి అంటే కచ్చితంగా వాళ్ళు ఫాలోయింగ్ ని చూస్తూ ఉంటారు. అగ్ర నిర్మాతలు అయినా చిన్న నిర్మాతలు అయినా సరే ఇదే ఫాలో అవుతూ ఉంటారు. టాలీవుడ్ లో చాలా మంది అవకాశాలు వచ్చినా సరే వద్దు అని పక్కన పెడుతూ ఉంటారు. ఫాలోయింగ్ ఉన్నా సరే వద్దు అని అనుకుంటారు. వారిలో ఒకరు యాంకర్ అనసూయ. ఆమెకు మంచి ఆఫర్లు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

 

అగ్ర హీరోల సినిమాల్లో ఆమెకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. అగ్ర హీరోల సినిమాలలో ఆమెకు ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి. విలన్ గా నటించాలి అని కోరుతున్నారు కొందరు. తాజాగా పుష్పా సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఆమెను ఎంపిక చేసారు అని టాక్ వినపడుతుంది. పుష్పా సినిమాలో ఒక నేరస్థుడి భార్యగా ఆమె నటిస్తుంది అని సమాచారం. ఆ ఆఫర్ ఆమెకు వచ్చింది గాని గ్లామర్ చూపించే పాత్ర కాదు. నటన మాత్రమే అందులో ప్రాధాన్యత ఉంటుంది. టాలీవుడ్ లో ఈ ఆఫర్లు అందరికి వచ్చే అవకాశం ఉండదు. 

 

ఫాలోయింగ్ ఉన్న వాళ్లకు రావడం చాలా కష్టం అని చెప్తారు. కాని అనసూయ కు వచ్చినా సరే ఆమె మాత్రం తాను చేయలేను అని చెప్తున్నట్టు టాలీవుడ్ జనం అంటున్నారు. పారితోషికం భారీగా ఇస్తామని చిత్ర దర్శకుడు సుకుమార్ వచ్చినా సరే ఆమె మాత్రం తాను చేసేది లేదు అని అంటున్నారట. దానికి కారణం యాంకరింగ్ మీద ఉన్న ప్రేమ అని అంటున్నారు. ఇప్పుడు తనను ఒక యాంకర్ టార్గెట్ చేసారని ఆమెకు దీటుగా తాను నిలబడాలి అనుకున్నారట ఆమె

మరింత సమాచారం తెలుసుకోండి: