టాలీవుడ్ లో హర్రర్ కాన్సెప్ట్ కి కామెడీ జోడింది ప్రేక్షకుల మనసు దోచాడు డైరెక్టర్, నటుడు లారెన్స్. సామాన్య కొరియోగ్రాఫర్ గా సినీ రంగ ప్రవేశం చేసిన లారెన్స్ తర్వాత నటుడిగా తన సత్తా చాటాడు. హీరోగా నటిస్తున్న సమయంలో డైరెక్షన్ రంగంలోకి అడుగు పెట్టాడు. ముని లాంటి హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ సూపర్ హిట్ అయ్యింది. దాని సీక్వెల్ గా కాంచన, కాంచన2, కాంచన3 సినిమాలు తీసి సూపర్ సక్సెస్ పొందాడు. ఈ మూవీస్ లో లారెన్స్ తానె డైరెక్టర్ చేసి హీరోగా నటించాడు. ఇలా ముని సీక్వెల్ కి మంచి ఆదరణ లభించింది. ఈ మూవీస్ కన్నడ లో కూడా రీమేక్ చేసి సక్సెస్ సాధించారు.
తాజాగా ఈ మూవీ బాలీవుడ్ లో రిమేక్ చేసేందుకు సిద్దమయ్యారు. ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అమెరికా లాంటి అగ్ర రాజ్యంలో ఇప్పటి వరకు 50 వేలకు మరణాలు చోటు చేసుకున్నాయి. దీని బారి నుంచి తమని తాము కాపాడుకోవడం కోసం దేశాలన్నీ స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయాయి. దీంతో వ్యవస్థలన్నీ స్థింభించి పోయాయి.సినిమాలు వాయిదా పడ్డాయి.. షూటింగ్స్ క్యాన్సల్ అయ్యాయి.. దాంతో సినీ కార్మికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సామాన్య జీవితం తలక్రిందులైంది. ప్రభుత్వాలు కరోనాని అరికట్టాలని ప్రయత్నిస్తున్నాయి.
ఇదిలా వుంటే కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీస్ ఇబ్బందుల్ని ఎదుర్కుంటోంది. లాక్డౌన్ పూర్తయినా సినిమా షూటింగ్లకు, రిలీజ్లకు ప్రభుత్వం అంత త్వరగా అనుమతులు ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అక్షయ్కుమార్ నటిస్తున్న `లక్ష్మీబాంబ్` మూవీ డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని తెలిసింది. కాగా, మేలో రిలీజ్ చేయాలని భావిస్తున్న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. కాకపోతే అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రాలేదు.