సినిమా సూపర్ హిట్ అయితే జరిగే చర్చ అంతా ఇంతా కాదు. కొన్నాళ్లు అదే సినిమా మ్యానియా నడుస్తుంది. అదే.. ఆ సినిమాలో కంటెంట్ కొత్తగా ఉంటే మరింత హిట్ అయి నటీనటులకు, టెక్నీషియన్లకు మంచి పేరు వస్తుంది. దీంతో ఆ సినిమాకు సీక్వెల్ అంటూ వార్తలు వస్తాయి. అసలు ఆ దర్శకుడికి సీక్వెల్ తీయాలనే ఆలోచన లేకపోయినా పరిస్థితులు రప్పించేస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో రెండేళ్ల క్రితం మంచి హిట్ అయిన ఆర్ఎక్స్ 100 సినిమాకు సీక్వెల్ రాబోతోందనే వార్త రౌండ్ అవుతోంది.

 

 

కార్తికేయ, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లు గా 2018లో వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ సాధించింది. దర్శకుడిగా అజయ్ భూపతి అద్భుతంగా తెరకెక్కించడంతో తనకూ మంచి పేరు వచ్చింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తీసేందుకు అజయ్ భూపతి కథ సిద్ధం చేస్తున్నాడని టాలీవుడ్ లో ఓ వార్త రౌండ్ అవుతోంది. రియల్ ఇన్సిడెంట్ తో తెరకెక్కిన ఆ సినిమాకు ఇప్పుడు తన సొంత ఆలోచనతో కథ రాస్తున్నాడని అంటున్నారు. అయితే.. ఆ సినిమాలో ట్రాజెడిక్ ఎండింగ్ ఉంటుంది. హీరో చనిపోతాడు. ఇప్పుడు ఈ కథను ఎక్కడ నుంచి మొదలుపెడతారని కొంతమంది అంటున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశమైంది.

 

 

ప్రస్తుతం ఈ వార్తపై అఫిషియల్ న్యూస్ లేకపోయినా సీక్వెల్ న్యూస్ అంటూ ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దర్శకుడిగా అజయ్ భూపతి, హీరోగా కార్తికేయ, హీరోయిన్ గా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కు మంచి గుర్తింపు వచ్చింది. ముగ్గురికీ అవకాశాలు బాగానే వచ్చాయి. అజయ్ రాసుకున్న మహా సముద్రం కథను శర్వానంద్ హీరోగా తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం అజయ్ భూపతి ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్నాడని తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: