టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెండేళ్ల క్రితం హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాలో హీరోగా నటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కెరీర్ 25వ సినిమాగా ఎన్నో అంచనాల మధ్య అప్పట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజ్ఞాతవాసి, అంచనాలు అందుకోలేక అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఆ తరువాత రెండేళ్ల పాటు పూర్తిగా సినిమాలకు విరామం పలికిన పవన్, మళ్ళి కొన్నాళ్ల క్రితం వకీల్ సాబ్ సినిమా ద్వారా టాలీవుడ్ కి మళ్ళి నటుడిగా పునః ప్రవేశం చేస్తున్నారు. 

IHG's Quiz

ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని రాబోయే మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సి ఉండగా, ప్రస్తుతం కరోనా మహమ్మారి దెబ్బ వలన మన దేశం అంతా లాక్ డౌన్ ప్రకటించడం, ఈ నేపథ్యంలో మిగతా రంగాలతో పాటు సినిమా రంగంలో కూడా షూటింగ్స్ అన్ని బంద్ చేయబడడంతో వకీల్ సాబ్ షూటింగ్ కూడా ఆగిపోయింది. కాగా ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఒక భారీ పీరియాడికల్ మూవీ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా, వకీల్ సాబ్ తో పాటు కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ సినిమాని దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్. 

 

అయితే ఈ సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతికనిపుణులుగా ఎవరు వ్యవహరిస్తున్నారు తదితర విషయాలన్నీ కూడా ఇప్పటివరకు వెల్లడి కాలేదు. అయితే నిన్న ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో సంగీత దర్శకుడు స్వరవాణి కీరవాణి మాట్లాడుతూ, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు తాను సంగీతం అందిస్తున్న విషయం వాస్తవమేనని, ఎంతో అద్భుతమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఆ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని, అలానే సంగీతంతో పాటు ఆ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు కూడా మంచి ప్రాధాన్యం ఉందని కీరవాణి అన్నారు. కాగా తొలిసారిగా పవన్ కళ్యాణ్, కీరవాణి ల కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: