టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, యువ నటుడు అక్కినేని నాగచైతన్య సరసన ఏ మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీకి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె నటించిన ఆ సినిమా అప్పట్లో మంచి హిట్ కొట్టి సమంతకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. హృద్యమైన ప్రేమకథగా ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా తరువాత సమంత కు విపరీతంగా అవకాశాలు తలుపు తట్టడం, ఆపై ఆమె వాటిని అందుకుని హిట్స్ గా మలుచుకుని మరింత పేరు గడించడం జరిగింది. ఇక తన కెరీర్ లో నటించిన సినిమాల్లో అత్యధిక శాతం హిట్స్ రికార్డు కలిగిన సమంత, మూడేళ్ళ క్రితం తన తొలి సినిమా హీరో నాగచైతన్య ను వివాహం చేసుకున్న తరువాత నుండి ఎంతో ఆచితూచి మాత్రమే సినిమాలు చేస్తున్నారు. 

IHG

ఇక ఇటీవల యు టర్న్, ఓ బాబీ వంటి విభిన్న తరహా సినిమాలు చేసి మంచి సక్సెస్ లు అందుకున్న సమంత, ఈ ఏడాది శర్వానంద్ సరసన నటించిన జాను సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. కొన్నాళ్ల క్రితం కోలీవుడ్ లో విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్ లో వచ్చిన 96 కి అధికారిక తెలుగు రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాను సినిమా ఇటీవల ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అంతకముందు ఆ సినిమా ఒరిజినల్ మాతృకగా 96 ని చాలా మంది మన వాళ్ళు కూడా చూసేసి ఉండడంతో పాటు, సరిగ్గా సినిమాలకు అన్ సీజన్ గా చెప్పబడే ఫిబ్రవరి లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం కూడా, ఆ సినిమా ఫెయిల్యూర్ కి కొంత కారణం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

 

ఇక నిన్న తన 32వ పుట్టినరోజుని ఘనంగా ఫ్యామిలీ మెంబెర్స్ మధ్య జరుపుకున్న సమంతకు ఆమె అభిమానులు పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియచేసారు. ఇకపోతే ఇటీవల జాను సినిమాని ఒక ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానల్ లో ప్రసారం చేయగా అది కేవలం 7.07 టిఆర్పి ని మాత్రమే దక్కించుకుందని, గతంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ఫ్లాప్ సినిమా నేల టిక్కెట్టు సినిమాని కొన్నాళ్లుగా వరుసగా ఒక టివి ఛానల్ వారు ప్రసారం చేయడం జరిగింది. కాగా అదే సినిమాని జాను సమయంలో ఆ ఛానల్ వారు ప్రసారం చేయగా దానికి 6.97 టిఆర్పి వచ్చిందని, దీనిని బట్టి జాను సినిమాకు ఎంత దారుణమైన రేంజ్ లో రేటింగ్ వచ్చిందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. ఇది నిజంగా సమంత ఫ్యాన్స్ కి చేదు వార్తే అని అంటున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: