టాలీవుడ్ హీరోలు కేవలం నటనకే పరిమితం కాకుండా. వారికి నచ్చిన రంగాల్లో హుషారుగా పాల్గొంటున్నారు. నటులు అంటే కేవలం నటించాలి.. ఇంకేం చేయకూడదు అనే రోజులు పోయాయి. ఇప్పుడు హీరోలు కూడా చాలా చేస్తున్నారు. కేవలం నటించడం తోనే తమ పని అయిపోయింది అనుకోవటం లేదు. వాళ్ళు దానికి మించి చాలానే సంపాదిస్తున్నారు. ముఖ్యంగా మన హీరోలు అంతా బిజినెస్ పై బాగానే దృష్టి పెడుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఇప్పుడు సైడ్ బిజినెస్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన హీరోల్లో సందీప్కిషన్ కూడా ఉన్నారు. ఈయన కేవలం నటన మాత్రమే వృత్తిగా తీసుకోలేదు. యువ హీరోల తీరు మారుతూ వస్తోంది. కేవలం సినిమాలే గాక సొంతంగా వ్యాపారం చేయడానికి ఎక్కువగా ఇంట్రస్ట్ చూపుతున్నారు యంగ్ హీరోస్. ఈ మేరకు మహేష్ బాబు, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ ఇప్పటికే వ్యాపార రంగంలో అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు కూడా. తాజాగా వారి బాటలోనే సందీప్ కిషన్ వెళ్తున్నాడు.
సరికొత్తగా ఆలోచిస్తూ కొత్త పుంతలు తొక్కుతున్నారు. వ్యాపార విస్తరణ దిశగా అడుగులేస్తున్నాడు సందీప్ కిషన్. ఈ ఏడాది హీరోగా, నిర్మాతగా మంచి విజయాలు అందుకున్న సందీప్...'నిను వీడని నీడను నేనే' సినిమాతో ఆయన నిర్మాతగా మారిన ఈ యంగ్ హీరో.. ఇటీవలే 'తెనాలి రామకృష్ణ'తో కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. హీరోగా, నిర్మాతగానే కాక సందీప్ కిషన్ వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నాడు. ఇప్పటికే జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ లో 'వివాహ భోజనంబు' పేరుతో ఆయనకు పలు రెస్టారెంట్లు ఉన్న విషయం తెలిసిందే.
విజయవంతంగా రెస్టారెంట్ నిర్వహిస్తున్న సందీప్.. కొత్తగా మరో వ్యాపారంలోకి ఎంటర్ అయ్యాడు. స్టైలిష్ రంగంలో పేరొందిన క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సందీప్ కిషన్ తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అమరావతిలో త్వరలో ఈ సెలూన్ ఫ్రాంచైజీని ప్రారంభించనున్నట్లు సమాచారం. సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ సందీప్ వేస్తున్న అడుగులు చూసి వావ్ అంటూ అవాక్కయిపోతున్నారు ఆయన అభిమానులు. సందీప్ కిషన్ ప్రస్తుతం 'ఏ1 ఎక్స్ప్రెస్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హాకీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం.